ఎక్స్‌ఛేంజ్‌ హౌస్‌లో దోపిడీ: అనుమానితుడి అరెస్ట్‌

- April 14, 2017 , by Maagulf
ఎక్స్‌ఛేంజ్‌ హౌస్‌లో దోపిడీ: అనుమానితుడి అరెస్ట్‌

ఎక్స్‌ఛేంజ్‌ హౌస్‌ దొంగతనం కేసులో అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిఫ్ఫాలో ఈ దొంగతనం జరిగింది. సదరన్‌ గవర్నరేట్‌ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ కల్నల్‌ ముబారక్‌ అబ్దుల్లా అల్‌ మెర్రి ఈ విషయాన్ని ధృవీకరించారు. 28 ఏళ్ళ వయసు గల వ్యక్తిని అనుమానాస్పదంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నామని కల్నల్‌ చెప్పారు. ఈ అరెస్ట్‌ సందర్బంగా నగదుని సైతం స్వాధీనం చేసుకున్నారు. చట్టపరమైన చర్యల కోసం నిందితుడ్ని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు. ఈస్ట్‌ రిఫ్ఫా లోని బహ్రెయిన్‌ ఫైనాన్సింగ్‌ కంపెనీ దోపిడీకి గురయ్యింది. ఆయుధాలతో ఓ వ్యక్తి ఈ దోపిడీకి పాల్పడ్డాడు. దోపిడీ అనంతరం పోలీసులు విచారణ చేపట్టారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com