పోలీసులపై దాడి కేసులో న్యాయస్థానం ముందుకి నిందితుడు
- April 14, 2017
39 ఏళ్ళ ఒమనీ వ్యక్తి, కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ ముందు హాజరయ్యాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా, వారిపై నిందితుడు దాడికి యత్నించాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులకు తేలికపాటి గాయాలయ్యాయి. పలు కేసులకు సంబంధించి నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా, అతను తమపై దాడికి దిగినట్లు గాయాలపాలైన పోలీసులు న్యాయస్థానానికి వివరించారు. మెడ మీదా, తల మీదా, చేతుల మీదా నిందితుడి గోళ్ళ కారణంగా గాయాలు అయినట్లు వారు తెలిపారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్కి తరలించి, అట్నుంచే ఆసుపత్రికి వెళ్ళి వైద్య చికిత్స పొందామని చెబుతూ, దానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్ని కూడా కోర్టు ముందుంచారు పోలీసులు. ఇంకో వైపున నిందితుడు, తమను పోలీసులు కొట్టారంటూ విచారణలో పేర్కొన్నాడు. అయితే నిందితుడిపై ఎలాంటి గాయాలూ కనిపించలేదు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







