ప్రయాణీకుడికి జైలు శిక్ష
- April 14, 2017
మొరాకోకి చెందిన వ్యక్తికి న్యాయస్థానం ఏడేళ్ళపాటు జైలు శిక్ష విధించింది. అలాగే 23,000 ఖతారీ రియాల్జ్ జరీమానాను కూడా విధించడం జరిగింది. విమానంలో ప్రయాణిస్తూ, తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడమే నిందితుడు చేసిన నేరం. విమానంలో స్టీవార్డ్స్పై దాడి చేయడం, అలాగే అవమానించడం వంటి చర్యల ద్వారా నిందితుడు విమానంలో వీరంగం సృష్టించాడు. దోహాకి విమానం చేరుకోగానే అతన్ని ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తదనంతరం అవసరమైన చర్యలు తీసుకుని, న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. అయితే తదుపరి అపీల్ కోసం నిందితుడు విజ్ఞప్తి చేయగా, అపీల్ కోర్ట్ దాన్ని తిరస్కరించింది. నిందితుడికి ఉన్న బ్యాడ్ క్రిమినల్ రికార్డ్ కారణంగా అపీల్కి అవకాశమివ్వలేదు. నిందితుడు మూడు చెక్ బౌన్సింగ్ కేసుల్లోనూ, ఒక మున్సిపల్ ఉల్లంఘన కేసులోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









