ప్రయాణీకుడికి జైలు శిక్ష
- April 14, 2017
మొరాకోకి చెందిన వ్యక్తికి న్యాయస్థానం ఏడేళ్ళపాటు జైలు శిక్ష విధించింది. అలాగే 23,000 ఖతారీ రియాల్జ్ జరీమానాను కూడా విధించడం జరిగింది. విమానంలో ప్రయాణిస్తూ, తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడమే నిందితుడు చేసిన నేరం. విమానంలో స్టీవార్డ్స్పై దాడి చేయడం, అలాగే అవమానించడం వంటి చర్యల ద్వారా నిందితుడు విమానంలో వీరంగం సృష్టించాడు. దోహాకి విమానం చేరుకోగానే అతన్ని ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తదనంతరం అవసరమైన చర్యలు తీసుకుని, న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. అయితే తదుపరి అపీల్ కోసం నిందితుడు విజ్ఞప్తి చేయగా, అపీల్ కోర్ట్ దాన్ని తిరస్కరించింది. నిందితుడికి ఉన్న బ్యాడ్ క్రిమినల్ రికార్డ్ కారణంగా అపీల్కి అవకాశమివ్వలేదు. నిందితుడు మూడు చెక్ బౌన్సింగ్ కేసుల్లోనూ, ఒక మున్సిపల్ ఉల్లంఘన కేసులోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







