ప్రయాణీకుడికి జైలు శిక్ష
- April 14, 2017
మొరాకోకి చెందిన వ్యక్తికి న్యాయస్థానం ఏడేళ్ళపాటు జైలు శిక్ష విధించింది. అలాగే 23,000 ఖతారీ రియాల్జ్ జరీమానాను కూడా విధించడం జరిగింది. విమానంలో ప్రయాణిస్తూ, తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడమే నిందితుడు చేసిన నేరం. విమానంలో స్టీవార్డ్స్పై దాడి చేయడం, అలాగే అవమానించడం వంటి చర్యల ద్వారా నిందితుడు విమానంలో వీరంగం సృష్టించాడు. దోహాకి విమానం చేరుకోగానే అతన్ని ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తదనంతరం అవసరమైన చర్యలు తీసుకుని, న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. అయితే తదుపరి అపీల్ కోసం నిందితుడు విజ్ఞప్తి చేయగా, అపీల్ కోర్ట్ దాన్ని తిరస్కరించింది. నిందితుడికి ఉన్న బ్యాడ్ క్రిమినల్ రికార్డ్ కారణంగా అపీల్కి అవకాశమివ్వలేదు. నిందితుడు మూడు చెక్ బౌన్సింగ్ కేసుల్లోనూ, ఒక మున్సిపల్ ఉల్లంఘన కేసులోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







