అఫ్గానిస్థాన్లోని ఇస్లామిక్ స్టేట్ దాడిలో 90మంది మృతి
- April 15, 2017
అఫ్గానిస్థాన్లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ స్థావరంపై అమెరికా జరిపిన అతిపెద్ద బాంబును జారవిడవడంతో హతమైన ఉగ్రవాదుల సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగింది. ఈ దాడిలో ఇప్పటివరకు 90మంది ఐసిస్ ఉగ్రవాదులు మృతిచెందినట్లు అచిన్ గవర్నర్ ఇస్మాయిల్ షిన్వారీ మీడియాకు వెల్లడించారు. నాన్గర్హర్ ప్రావిన్స్ అధికారి ప్రతినిధి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
అఫ్గాన్-పాక్ సరిహద్దుల్లో గల నాన్గర్హర్ ప్రావిన్స్లోని అచిన్ జిల్లాలో అమెరికా గురువారం అతిపెద్ద బాంబు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. జిల్లాలోని సొరంగమార్గ సముదాయంపై జీజీయూ-43/బి బాంబును జార విడిచింది. ఈ దాడిలో ఐసిస్కు చెందిన మూడు భూగర్భ సొరంగాలు, భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ధ్వంసమయ్యాయి. అయితే తొలుత 36 మంది ఉగ్రవాదులు మరణించినట్లు అఫ్గాన్ రక్షణశాఖ వెల్లడించగా.. శనివారం నాటికి ఆ సంఖ్య 90కు చేరినట్లు అధికారులు తెలిపారు. ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’గా పిలిచే అతి శక్తిమంతమైన ఈ బాంబు 21,600 పౌండ్ల బరువుంటుంది.
తొలిసారిగా దీన్ని ఓ యుద్ధంలో ప్రయోగించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







