2021 నాటికి పేపర్‌లెస్‌ గర్నమెంట్‌

- April 16, 2017 , by Maagulf
2021 నాటికి పేపర్‌లెస్‌ గర్నమెంట్‌

2021 నాటికి దుబాయ్‌ని పేపర్‌లెస్‌ గవర్నమెంట్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. దుబాయ్‌ రీజినల్‌ బిజినెస్‌ హబ్‌, డెడ్‌లైన్‌ రోజున చివరి పేపర్‌ డాక్యుమెంట్‌ని రిలీజ్‌ చేస్తుందని క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ హమదాన్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ పేర్కొన్నారు. భవిష్యత్‌ అంతా పేపర్‌ ఫ్రీ ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతాయని తాను విశ్వసిస్తున్నట్లు ఆయన ఓ ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. స్మార్ట్‌ దుబాయ్‌ ఆఫీస్‌ ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ హెడ్‌ యూనిస్‌ అల్‌ నాజర్‌ మాట్లాడుతూ, డబ్‌డ్‌ దుబాయ్‌ పల్స్‌ సెంట్రల్‌ ప్లాట్‌ఫామ్‌ని ప్రభుత్వ డేటా కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పబ్లిక్‌, ప్రైవేట్‌ సెక్టార్‌, అలాగే ఇండివుడ్యువల్స్‌కి డేటా ఎక్స్‌ఛేంజ్‌, అలాగే అవసరమైన వివరాలె తెలియజేసేందుకు వీలుగా ఈ స్మార్ట్‌ విధానం ఉపకరిస్తుందని ఆయన తెలిపారు. స్మార్ట్‌ దుబాయ్‌ ప్రాజెక్ట్‌, 1000 ప్రభుత్వ సర్వీసుల్ని ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. 2021 నాటికి 1,129 సర్వీసులకుగాను అందుబాటులోకి రానుంది. అరబ్‌ రీజియన్‌లో దుబాయ్‌, టెక్నాలజీ పరంగా అడ్వాన్స్‌డ్‌ సిటీగా పేరొందింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com