మే 25, 26 తేదీల్లో ఇండియన్‌ స్కూల్‌ ఫెయిర్‌

- April 16, 2017 , by Maagulf
మే 25, 26 తేదీల్లో ఇండియన్‌ స్కూల్‌ ఫెయిర్‌

గత ఏడాది నిర్వహించిన ఇండియన్‌ స్కూల్‌ మెగా ఫెయిర్‌లో సుమారు 800 మంది విద్యార్థులకు ఫీజు రాయితీ లభించిందని ఇండియన్‌ స్కూల్‌ బహ్రెయిన్‌ (ఐఎస్‌బి) ఛైర్మన్‌ ఎస్‌ నటరాజన్‌ చెప్పారు. ఇసా టౌన్‌ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో ఈ వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది నిర్వహించే మెగా ఫెయిర్‌ వివరాల్ని ప్రకటించారు. ఈ ఏడాది నిర్వహించే మెగా ఫెయిర్‌, విద్యార్థులకు, సిబ్బందికి మరింతగా ఉపయోగపడ్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మే 25, 26 తేదీల్లో మెగా ఫెయిర్‌ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఫుడ్‌ ఫెస్టివల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఎక్స్‌పో, స్టూడెంట్స్‌తో గ్రాండ్‌ ఎగ్జిబిషన్‌ వంటివి నిర్వహిస్తారు. ఎంట్రీ ఫీజుని ఒక్కొక్కరికి 2 బహ్రెయినీ దినార్స్‌గా నిర్ణయించారు. ఈ ఫెస్టివల్‌ ద్వారా జనరేట్‌ అయ్యే నిధుల్ని, స్కల్‌ అభివృద్ధికి, వెల్ఫేర్‌ యాక్టివిటీస్‌కి వినియోగిస్తామని తెలిపారు నటరాజన్‌. తమ స్కూల్‌ మాత్రమే లోయెస్ట్‌ ఫీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కలిగి ఉందనీ, స్పాన్సరర్స్‌, కమ్యూనిటీ మెంబర్స్‌ సహకారంతో విజయవంతంగా స్కూల్‌ నడుస్తోందని చెప్పారాయన. ఈసారి నిర్వహించే మెగా ఫెయిర్‌ సూపర్‌ సక్సెస్‌ అవుతుందని, ఫెయిర్‌కి వచ్చేవారి భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటామని వివరించారు నటరాజన్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com