తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం వడగాలుల హెచ్చరిక
- April 16, 2017
తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 2 నుంచి 4 డిగ్రీలు అదనంగా పెరిగి అన్ని చోట్లా 42 డిగ్రీలను దాటే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం పలుప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశముందని కేంద్రం సంచాలకురాలు డాక్టర్ కె.నాగరత్న తెలిపారు. ఆదివారం పలుచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో గాలిలో తేమ పూర్తిగా తగ్గి వేడి, ఉక్కపోతలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గత పదేళ్లలో ఏప్రిల్ నెలలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల స్థాయికి చేరువగా ఆదివారం నమోదవడం గమనార్హం. హైదరాబాద్లో అత్యధికంగా 2016 ఏప్రిల్ 14న 43 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదవగా దానికి చేరువగా ఆదివారం 42.4 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణంకన్నా 4 డిగ్రీలు అదనం. వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం సాధారణంకన్నా 4 డిగ్రీలు అదనంగా పెరిగితే వడగాలుల తీవ్రత ఎక్కువవుతుంది. ఆదివారం అత్యధికంగా ఆదిలాబాద్, నిజామాబాద్లలో ఉష్ణోగత్ర 44.4 డిగ్రీలకు చేరింది. హైదరాబాద్లో గాలిలో తేమ సాధారణంగా 52 శాతముండాలి. కానీ అది 31 శాతానికి పడిపోవడంతో నగరవాసులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







