అమ్నెస్టీ ద్వారా 1 మిలియన్‌ వలసదారులకు లబ్ది

- April 19, 2017 , by Maagulf
అమ్నెస్టీ ద్వారా 1 మిలియన్‌ వలసదారులకు లబ్ది

 ఇంకో 70 రోజుల్లో అమ్నెస్టీ గడువు పూర్తి కానుంది. మొత్తం 90 రోజుల అమ్నెస్టీ పీరియడ్‌ని వినియోగించుకుని, దేశం నుంచి 1 మిలియన్‌ ఉల్లంఘనులు, దేశం నుంచి బయటకు వెళ్ళే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ పాస్‌పోర్ట్స్‌ అండ్‌ మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ ఈ అంచనాల్ని వెల్లడించింది. అమ్నెస్టీకి మంచి స్పందన వస్తోందని అధికారులు చెబుతున్నారు. వివిధ కారణాలతో ఉల్లంఘనలకు పాల్పడ్డవారికి అమ్నెస్టీ ఓ వరంగా మారుతోంది. మార్చి 29న ఈ అమ్నెస్టీ క్యాంప్‌ ప్రారంభమయ్యింది. సోషల్‌ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అమ్నెస్టీకి సంబంధించిన అప్‌డేట్స్‌ని జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ పాస్‌పోర్ట్స్‌ వివరిస్తోంది. 2013లో ఇచ్చిన అమ్నెస్టీని 3 మిలియన్‌ వలసదారులు వినియోగించుకున్నారు. అమ్నెస్టీ గడువుని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా క్రౌన్‌ ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ నైఫ్‌ ఉల్లంఘనులకు సూచించారు. వివిధ సంస్థలు అమ్నెస్టీకి సంబంధించిన సమాచారానికి విస్తృత ప్రచారం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com