అమ్నెస్టీ ద్వారా 1 మిలియన్ వలసదారులకు లబ్ది
- April 19, 2017
ఇంకో 70 రోజుల్లో అమ్నెస్టీ గడువు పూర్తి కానుంది. మొత్తం 90 రోజుల అమ్నెస్టీ పీరియడ్ని వినియోగించుకుని, దేశం నుంచి 1 మిలియన్ ఉల్లంఘనులు, దేశం నుంచి బయటకు వెళ్ళే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఈ అంచనాల్ని వెల్లడించింది. అమ్నెస్టీకి మంచి స్పందన వస్తోందని అధికారులు చెబుతున్నారు. వివిధ కారణాలతో ఉల్లంఘనలకు పాల్పడ్డవారికి అమ్నెస్టీ ఓ వరంగా మారుతోంది. మార్చి 29న ఈ అమ్నెస్టీ క్యాంప్ ప్రారంభమయ్యింది. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అమ్నెస్టీకి సంబంధించిన అప్డేట్స్ని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ వివరిస్తోంది. 2013లో ఇచ్చిన అమ్నెస్టీని 3 మిలియన్ వలసదారులు వినియోగించుకున్నారు. అమ్నెస్టీ గడువుని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ నైఫ్ ఉల్లంఘనులకు సూచించారు. వివిధ సంస్థలు అమ్నెస్టీకి సంబంధించిన సమాచారానికి విస్తృత ప్రచారం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







