సాహూగా మనముందుకు రాబోతున్న ప్రభాస్ కొత్త సినిమా
- April 20, 2017
తెలుగు ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ 'చత్రపతి' చిత్రం తర్వాత ఎక్కడ లేని మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక డార్లింగ్, మిర్చి లాంటి సినిమాల తర్వాత మనోడి స్టార్ ఇమేజ్ మారిపోయింది. ఇక రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రంతో ఏకంగా జాతీయ స్థాయిన నటుడుగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు భారత దేశం అంతటా 'బాహుబలి' మానియా పట్టుకుంది. అయితే బాహుబలి చిత్రం కోసం ప్రభాస్ ఎన్నో త్యాగాలు చేశారు. ముఖ్యంగా ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఏ చిత్రానికి కమిట్ కాకుండా దూరంగా ఉంటూ వచ్చారు.
దీంతో దాదాపు ఐదు సంవత్సరాలు ఫ్యాన్స్ కి బాహుబలి తప్ప ఏ సినిమాలో కనిపించకుండా పోయాడు ప్రభాస్. దీంతో బాహుబలి 2 రిలీజ్ తర్వాత ఏకంగా రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. అంతే కాదు యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో త్రిభాషా చిత్రం చేయనున్నాడు ప్రభాస్ . ఆ సినిమా ఎప్పుడో ప్రారంభమైన విషయం కూడా తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కోసం ప్రత్యేకంగా షూటింగ్ చేసిన చిత్రయూనిట్ ఫస్ట్ లుక్ను బాహుబలి రిలీజ్ కన్నా ఐదు రోజుల ముందే విడుదల చేస్తున్నారు.
రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాహో అనే టైటిల్ను ఫైనల్ చేశారన్న ప్రచారం జరుగుతోంది.అవును ఏప్రిల్ 23న ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో నటించనున్న ''సాహో '' ఫస్ట్ లుక్ ని టైటిల్ ని అనౌన్స్ చేయనున్నారు .అంతేకాదు టీజర్ ని కూడా రిలీజ్ చేస్తున్నారు . బాహుబలి 2 తో పాటు అన్ని థియేటర్ లలో ఈ టీజర్ ని ప్రదర్శిస్తారు .
మొత్తానికి ప్రభాస్ కెరీర్ లో బాహుబలి తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఈ సినిమాను 150 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మది సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శంకర్ ఇషాన్ లాయ్లు సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ తారను హీరోయిన్గా తీసుకోవాలని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం
- ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్









