సికందరీ రాన్
- April 20, 2017
కావలసిన పదార్థాలు: మటన్ జాయింట్ - 600 గ్రా, కారం - 20 గ్రా, అల్లం వెల్లుల్లి ముద్ద - తగినంత, కాశ్మీరీ కారం - 50 గ్రా
గరం మసాలా - రెండు గ్రా, ఆవ నూనె - 100 మి.లీ, పెరుగు - 300 మి.లీ, ఉప్పు - రుచికి సరిపడా.
తయారీ విధానం: కాశ్మీరీ కారం, అల్లం వెల్లుల్లి, ఉప్పు బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మటన్ జాయింట్కు పట్టించి ఫ్రిజ్లో కనీసం 6 గంటలు ఉంచాలి. వెడల్పాటి పాత్ర తీసుకుని అందులో రెండు లీటర్ల నీళ్లు పోసి మిగిలిన పదార్థాలు, మటన్ జాయింట్ను వేయాలి. పాత్రకు సిల్వర్ ఫాయిల్ చుట్టేయాలి. 160 డిగ్రీల్లో ఓవెన్ను ప్రీ హీట్ చేసుకుని దాన్లో పాత్రను ఉంచాలి. ఇలా గంటంబావు ఉడికిస్తూ మధ్య మధ్యలో గమనిస్తూ ఎముక నుంచి మటన్ వేరు పడుతున్నప్పుడు ఓవెన్ నుంచి బయటకు తీయాలి. దీన్ని మళ్లీ ఇనుప చువ్వకు గుచ్చి నిప్పులపై కాల్చాలి. ఆ తర్వాత పైన సాస్తో అలంకరించి వడ్డించాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









