దోహాలో థాయ్ టూరిజం రోడ్ షో
- April 22, 2017
టూరిజం అథారిటీ ఆఫ్ థాయిలాండ్ (టిఎటి) దుబాయ్ మరియు మిడిల్ ఈస్ట్ కార్యాలయం, ఖతార్ ఎయిర్ వేస్తో కలిసి దోహాలో రోడ్ షో నిర్వహించాయి. థాయిలాండ్ టూరిజంని ప్రమోట్ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా థాయిలాండ్కి చెందిన ప్రైవేట్ సెక్టార్ అలాగే ఖతార్కి చెందిన ట్రావెల్ ట్రేడ్ అండ్ టూరిజం పార్టనర్స్ మధ్య సన్నిహిత సంబంధాల దిశగా కూడా చేపట్టారు. ఖతారీ నేషనల్స్ మరియు నివాసితులకు థాయిలాండ్ అత్యద్భుతమైన టూరిజం డెస్టినేషన్ అని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. థాయిలాండ్లోని పర్యాటక కేంద్రాల గురించి నిర్వాహకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. గత ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు మొత్తం 671,202 మంది టూరిస్టులకు మిడిల్ ఈస్ట్ నుంచి తాము ఆహ్వానం పలికినట్లు టిఎటి డైరెక్టర్ - దుబాయ్ అండ్ మిడిల్ ఈస్ట్ మార్కెట్ ఛాలెర్మసాక్ సురానాంత్ చెప్పారు. మిడిల్ ఈస్ట్ రీజియన్లో యూఏఈ, ఒమన్, కువైట్, బహ్రెయిన్, మరియు ఖతార& దేశాలు టూరిజం రంగంలో టాప్ 5 స్పెండింగ్ కంట్రీస్గా ఉన్నాయి.
తాజా వార్తలు
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!







