దోపిడీ కేసులో కోర్టుకు హాజరుకాని ఐదుగురు నిందితులకు జైలుశిక్ష
- April 22, 2017
దోహా:దేశం కానీ దేశం వచ్చి నేర సామ్రాజ్యాన్ని నెలకొల్పారు .. అక్కడ ప్రజల కష్టార్జితాన్ని దోచుకొనే దొంగల ముఠాగా ఏర్పడి ఇళ్లల్లో చోరీలు చేయడం ప్రారంభించారు. ఒక రోజు ఎంచక్కా దోహా పోలీసులకు దొరికిపోయారు..చేసిన తప్పులు ఒప్పుకొని న్యాయస్థానం ఎదుట వినయంగా ఉండాల్సింది పోయి.కోర్టుకి వెళ్లకుండా డుమ్మా కొట్టారు..ఆ ఫలితం అనుభవిస్తున్నారు. ఒక ఇంటి దోపిడీ కేసులో కోర్టుకు హాజరుకాని ఐదుగురు శ్రీలంక నిందితులకు, వీరికి పర్యాటక వీసాపై ఇచ్చిన వారితో సహా దోహా క్రిమినల్ కోర్ట్ ఐదు సంవత్సరాల జైలుశిక్ష అనంతరం దేశ బహిష్కరణ విధించారు.గృహ దోపిడీ కోసం బహిష్కరణకు గురయ్యారు. కోర్టు ధర్మాసనం తెలిపిన వివరాల ప్రకారం ఈ ముద్దాయిలు మరొక వ్యక్తి ఇంట్లో తలుపులు పగుల కొట్టి ఆభరణాలు, ఖరీదైన బ్రాండ్గడియారాలు, మహిళల హ్యాండ్ బ్యాగులు మరియు ఇతర ఉపకరణాలు సహా 90,000 కతర్ రియళ్ళు కంటే ఎక్కువ విలువ వస్తువులను దొంగిలించారని ఆరోపించారు. అంతేకాకుండా, వారు దొంగిలించిన వస్తువులను వారి స్వదేశానికి పంపేవారు. దోపిడీకి గురి కాబడ్డ బాధితుడు, తన తల్లి వద్ద నుండి ఫోన్ కాల్ అందుకున్నప్పుడు, ఆ కుటుంబంలో విదేశాలకు ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో కొంతమంది ఇంటిలోపల ప్రవేశించారు, పైన పేర్కొన్న పలు విలువైన వస్తువులను దొంగిలించారు. పోలీసుల పరిశోధనలు ప్రకారం ఈ శ్రీలంక ముద్దాయిలు పలు ఇళ్లల్లో విలువైన వస్తువులను దొంగిలించడానికి సెలవుదినాలు సమయంలోఖాళీ ఇళ్ళు లక్ష్యంగా ఒక నేర ముఠాగా వీరంతా ఏర్పడినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









