దోపిడీ కేసులో కోర్టుకు హాజరుకాని ఐదుగురు నిందితులకు జైలుశిక్ష
- April 22, 2017
దోహా:దేశం కానీ దేశం వచ్చి నేర సామ్రాజ్యాన్ని నెలకొల్పారు .. అక్కడ ప్రజల కష్టార్జితాన్ని దోచుకొనే దొంగల ముఠాగా ఏర్పడి ఇళ్లల్లో చోరీలు చేయడం ప్రారంభించారు. ఒక రోజు ఎంచక్కా దోహా పోలీసులకు దొరికిపోయారు..చేసిన తప్పులు ఒప్పుకొని న్యాయస్థానం ఎదుట వినయంగా ఉండాల్సింది పోయి.కోర్టుకి వెళ్లకుండా డుమ్మా కొట్టారు..ఆ ఫలితం అనుభవిస్తున్నారు. ఒక ఇంటి దోపిడీ కేసులో కోర్టుకు హాజరుకాని ఐదుగురు శ్రీలంక నిందితులకు, వీరికి పర్యాటక వీసాపై ఇచ్చిన వారితో సహా దోహా క్రిమినల్ కోర్ట్ ఐదు సంవత్సరాల జైలుశిక్ష అనంతరం దేశ బహిష్కరణ విధించారు.గృహ దోపిడీ కోసం బహిష్కరణకు గురయ్యారు. కోర్టు ధర్మాసనం తెలిపిన వివరాల ప్రకారం ఈ ముద్దాయిలు మరొక వ్యక్తి ఇంట్లో తలుపులు పగుల కొట్టి ఆభరణాలు, ఖరీదైన బ్రాండ్గడియారాలు, మహిళల హ్యాండ్ బ్యాగులు మరియు ఇతర ఉపకరణాలు సహా 90,000 కతర్ రియళ్ళు కంటే ఎక్కువ విలువ వస్తువులను దొంగిలించారని ఆరోపించారు. అంతేకాకుండా, వారు దొంగిలించిన వస్తువులను వారి స్వదేశానికి పంపేవారు. దోపిడీకి గురి కాబడ్డ బాధితుడు, తన తల్లి వద్ద నుండి ఫోన్ కాల్ అందుకున్నప్పుడు, ఆ కుటుంబంలో విదేశాలకు ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో కొంతమంది ఇంటిలోపల ప్రవేశించారు, పైన పేర్కొన్న పలు విలువైన వస్తువులను దొంగిలించారు. పోలీసుల పరిశోధనలు ప్రకారం ఈ శ్రీలంక ముద్దాయిలు పలు ఇళ్లల్లో విలువైన వస్తువులను దొంగిలించడానికి సెలవుదినాలు సమయంలోఖాళీ ఇళ్ళు లక్ష్యంగా ఒక నేర ముఠాగా వీరంతా ఏర్పడినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









