38 మంది భారతీయుల నిర్బంధం బ్రిటన్లో
- April 23, 2017
వీసా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలతో 38 మంది భారతీయులను బ్రిటన్ ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారు. వీరిలో తొమ్మిది మంది మహిళలు. మరొక ఆఫ్గాన్ జాతీయుడు కూడా అరెస్టు అయ్యాడు. లీచెస్టర్ నగరంలోని రెండు వస్త్ర కర్మాగారాలపై ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ బృందం గతవారం దాడులు నిర్వహించగా వీరు పట్టుబడ్డారు. 31 మంది వీసా గడువు ముగిసినప్పటికీ దేశంలోనే కొనసాగుతున్నారని, ఏడుగురు దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని, ఒకరు వీసా నిబంధనలను ఉల్లంఘించి ఉద్యోగం చేస్తున్నారని అధికారులను ఉటంకిస్తూ స్థానిక ‘లీచెస్టర్ మెర్క్యూరీ’ పత్రిక వెల్లడించింది. వీరిని ఉద్యోగులుగా చేర్చుకున్న రెండు కంపెనీలు...ఎంకే క్లాతింగ్ లిమిటెడ్, ఫ్యాషన్ టైమ్స్ యూకే లిమిటెడ్ పైనా భారీ జరిమానాలను విధించే అవకాశం ఉందని ఇమిగ్రేషన్ అధికారి ఒకరు వెల్లడించారు.
తాజా వార్తలు
- Saud bin Saqr receives Consul-General of Russian Federation
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?







