మమ్ముట్టి తనయుడు జెమిని గణేశన్ గా
- April 23, 2017
యువ దర్శకుడు నాగ అశ్విన్ "ఎవడే సుబ్రమణ్యం" సినిమాతో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకొన్నాడు.. తాజాగా తన రెండో సినిమా గా అలనాటి అందాల నటి "సావిత్రిని జీవిత చరిత్రను 'మహానటి' గా " తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 10 నుంచి హైదరాబాద్ లో జరుపుకోనున్నది.. ఇప్పటికే సావిత్రిగా కీర్తి సురేష్ ను, మరో కీలక పాత్రలో సమంత ను ఎంపిక చేసిన సంగతి విధితమే.. కాగా సావిత్రి జీవితంలో ముఖ్యమైన వ్యక్తి.. సావిత్రి భర్త జెమినీ గణేశన్.. ఈ పాత్రలో ఎవరు నటిస్తారు అనే ఆసక్తి అందరిలోనూ ఉన్నది.. ఇప్పటికే ఇద్దరి .. ముగ్గురు హీరోల పేర్లు వినిపించినా.. చివరకు ఓ యంగ్ స్టార్ హీరో ఆ క్యారెక్టర్ లో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.. మలయాళ నటుడు ముమ్ముట్టి తనయుడిగా అడుగు పెట్టి.. తన నటనతో అందరినీ ఆకట్టుకొన్న దుల్కర్ సల్మాన్ ను జెమినీ గణేశన్ పాత్రకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.. దుల్కర్ ఇప్పటికే ఒకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడిగా మారాడు.. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా ఎన్టీఆర్, ఎన్నార్ ల పాత్రలు ఎంపిక చేయాల్సి ఉన్నది.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







