మమ్ముట్టి తనయుడు జెమిని గణేశన్ గా
- April 23, 2017
యువ దర్శకుడు నాగ అశ్విన్ "ఎవడే సుబ్రమణ్యం" సినిమాతో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకొన్నాడు.. తాజాగా తన రెండో సినిమా గా అలనాటి అందాల నటి "సావిత్రిని జీవిత చరిత్రను 'మహానటి' గా " తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 10 నుంచి హైదరాబాద్ లో జరుపుకోనున్నది.. ఇప్పటికే సావిత్రిగా కీర్తి సురేష్ ను, మరో కీలక పాత్రలో సమంత ను ఎంపిక చేసిన సంగతి విధితమే.. కాగా సావిత్రి జీవితంలో ముఖ్యమైన వ్యక్తి.. సావిత్రి భర్త జెమినీ గణేశన్.. ఈ పాత్రలో ఎవరు నటిస్తారు అనే ఆసక్తి అందరిలోనూ ఉన్నది.. ఇప్పటికే ఇద్దరి .. ముగ్గురు హీరోల పేర్లు వినిపించినా.. చివరకు ఓ యంగ్ స్టార్ హీరో ఆ క్యారెక్టర్ లో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.. మలయాళ నటుడు ముమ్ముట్టి తనయుడిగా అడుగు పెట్టి.. తన నటనతో అందరినీ ఆకట్టుకొన్న దుల్కర్ సల్మాన్ ను జెమినీ గణేశన్ పాత్రకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.. దుల్కర్ ఇప్పటికే ఒకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడిగా మారాడు.. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా ఎన్టీఆర్, ఎన్నార్ ల పాత్రలు ఎంపిక చేయాల్సి ఉన్నది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









