భారీ ర్యాలీ చేపడతా : అమెరికాఅధ్యక్షుడు ట్రంప్
- April 23, 2017
100 రోజులు పూర్తయిన సందర్భంగా
వాషింగ్టన్ : ఏప్రిల్ 29 నాటికి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ 100 రోజులు పూర్తిచేసుకోనున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా తన 100వ రోజున భారీ ర్యాలీ చేపడతానని ట్రంప్ అన్నారు. పెన్సిల్వేనియాలో ఈ ర్యాలీ చేపడతానని ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే అదే రోజున శ్వేతసౌధంలో కరెస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ నిర్వహిస్తున్నారు. వైట్హౌస్లో వార్తలు కవర్ చేసే మీడియా వర్గాల అసోసియేషన్ ఇది. వీరు ఏటా శ్వేతసౌధంలో విందు ఏర్పాటుచేస్తారు. చాలా మంది దేశాధ్యక్షులు ఈ విందుకు హాజరవుతారు. కానీ ట్రంప్ మాత్రం డిన్నర్ను మానుకొని పెన్సిల్వేనియాలో ర్యాలీ చేస్తానని ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది. అయితే ఈ ఏడాది శ్వేతసౌధం విందులో తాను పాల్గొనబోనని ట్రంప్ ముందే ప్రకటించారు. తన విషయంలో మీడియా కవరేజ్పై అసంతృప్తిగా ఉన్నానని, అందుకు నిరసనగానే తాను ఈ విందుకు హాజరుకావట్లేదని ట్రంప్ చెప్పారు. ట్రంప్తో పాటు ఆయన సిబ్బంది కూడా ఈ డిన్నర్లో పాల్గొనడం లేదు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









