భారీగా తగ్గినా పసిడి ధర ​

- April 24, 2017 , by Maagulf
భారీగా తగ్గినా పసిడి ధర ​

గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర తగ్గింది. సోమవారం నాటి ట్రేడింగ్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.350 తగ్గి రూ.29,650కు చేరింది. అంతర్జాతీయంగా బలహీన పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడం ఇందుకు కారణమని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి. మరోవైపు వెండి ధర కూడా రూ.100 తగ్గింది. కిలో వెండి రూ.41,600 కు చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గడం ఇందుకు కారణమైంది. మార్చి 2 తర్వాత అంతర్జాతీయంగా పసిడి ధర 1.5శాతం తగ్గడం విశేషం. ఔన్సు బంగారం రూ.1,265.51 డాలర్లు పలుకుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com