ఓయూకు రాష్ట్రపతి.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- April 25, 2017
రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ బుధవారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు, ఇఫ్లూ స్నాతకోత్సవాల్లో పాల్గొని ఆయన ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. పలుచోట్ల ట్రాఫిక్ను నిలిపివేయనున్నారు. మరికొన్నిచోట్ల ట్రాఫిక్ను మళ్లించనున్నారు. బేగంపేట్ విమానాశ్రయం నుంచి ఓయూ మార్గంలో ఈ ఆంక్షలు కొనసాగించనున్నారు. బేగంపేట నుంచి ఓయూ మార్గంలో రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.45 గంటల వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఓయూ శతాబ్ది వేడుకల అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ రాజ్భవన్కు వెళ్లనుండటంతో ఓయూ నుంచి రాజ్భవన్ వైపు మార్గంలో మధ్యాహ్నం 1.15 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది. అనంతరం రాజ్భవన్ నుంచి రాష్ట్రపతి గచ్చిబౌలికి వెళ్లనుండటంతో ఈ సందర్భంగా రాజ్భవన్ నుంచి గచ్చిబౌలి మార్గంలో రేపు సాయంత్రం 4గంటల నుంచి 4.45 వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను కొనసాగించనున్నారు. ఇఫ్లూ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి అక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని దిల్లీకి వెళ్లనున్నారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









