పాకిస్థాన్లో బాంబు పేలుడు 10మంది మృతి
- April 25, 2017
-ఆరుగురు చిన్నారులు సహా 10మంది మృతి
పెషావర్: పాకిస్థాన్లోని ఖుర్రం గిరిజన ప్రాంతం కొంతారా గ్రామంలో తాలిబన్ ఉగ్రవాదులు మంగళవారం ఓ వ్యాన్ లక్ష్యంగా రిమోట్ కంట్రోల్తో శక్తిమంతమైన ఐఈడీ బాంబు పేల్చారు. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు సహా 10 మంది మృతిచెందారు. గాయపడ్డ 13మందిని సమీపంలోని దవాఖానకు తరలించారు. క్షతగాత్రులకు పెషావర్లో వైద్యసేవలు అందించేందుకు ఖుర్రం రాజధాని పరచినర్కు ఎంఐ-17 హెలీకాప్టర్ పంపించామని సైనిక సమాచార విభాగ అధికారులు తెలిపారు. తెహ్రిక్-ఈ-తాలిబన్ పాకిస్థాన్ చీలికవర్గ నేత జమ్మాతుల్ అహరర్ ఈ దాడి చేసినట్లు ప్రకటించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









