సౌదీ సేఠ్ చెరలో నుంచి రేణుకను రప్పిస్తాం: నన్నపనేని
- April 26, 2017
సౌదీ సేఠ్ చెరలో ఉన్న జయచంద్ర భార్య రేణుకను స్వదేశానికి రప్పిస్తామని మహిళా కమిషన చైర్పర్సన నన్నపనేని రాజకుమారి హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా ఏర్పేడులో గత శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో 15మంది మృతి చెందడం, వీరిలో 12మంది ఒక్క మునగలపాళెం గ్రామస్తులే కావడం తెలిసిందే. నన్నపనేని రాజకుమారి బుధవారం మునగలపాళెంలో మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇదే ఘటనలో మరణించిన జయచంద్ర తల్లి సుభద్రమ్మ, కుటుంబసభ్యులతో మాట్లాడారు. జయచంద్ర భార్య రేణుక సౌదీలోని సేఠ్ చెరలో ఉ న్నారని..కడచూపులకు కూడా ఆమె రాలేకపోయిందని తెలియడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రేణుకను స్వదేశం రప్పించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









