శరీరంలో రక్తం వృద్ధి చెందాలంటే ఏం చేయాలి?
- April 27, 2017
ప్రస్తుతం చాలామంది రక్తహీనతను ఎదుర్కొంటున్నారు. తినే ఆహారంలో సరైన జాగ్రత్తలు లేకపోవడంతో రక్తహీనతను ఎదుర్కొంటున్నారు. ప్రతి వెయ్యిమందిలో 50 మందికి పైగా రక్తహీనతను ఎదుర్కొంటున్నారని వైద్యులే చెబుతున్నారు. అయితే రక్తహీనత నుంచి బయటపడాలంటే ఇలా చేయాలి.
చిలకడ దుంపల్ని మెత్తగా ఉడికించి తినాలి. అలాగే నేరేడుపండ్ల రసం ప్రతిరోజూ రాత్రిపూట తాగితే రక్తవృద్ధి కలగడమేకాక శుద్ది కూడా అవుతుందట. సపోటా పండ్లు ప్రతిరోజూ క్రమంతప్పకుండా తిన్నా, టమోటాలను గింజ లేకుండా తీసి ఆ రసాన్ని ఉదయం పూట తాగితే రక్తవృద్ధికి కారకం అవుతుందట.
అంతేకాదు ద్రాక్షకు రక్తాన్ని శుభ్రపరిచే గుణం వుంది. ప్రతిరోజూ ఒక ఆపిల్ పండు తిన్నా రక్తం వృద్ధి చెంది శరీరానికి మంచి బలం చేకూర్చుతుందట. ఇలా తు.చ తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా ఆరోగ్యవంతులవుతారని వైద్యులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన









