శరీరంలో రక్తం వృద్ధి చెందాలంటే ఏం చేయాలి?
- April 27, 2017
ప్రస్తుతం చాలామంది రక్తహీనతను ఎదుర్కొంటున్నారు. తినే ఆహారంలో సరైన జాగ్రత్తలు లేకపోవడంతో రక్తహీనతను ఎదుర్కొంటున్నారు. ప్రతి వెయ్యిమందిలో 50 మందికి పైగా రక్తహీనతను ఎదుర్కొంటున్నారని వైద్యులే చెబుతున్నారు. అయితే రక్తహీనత నుంచి బయటపడాలంటే ఇలా చేయాలి.
చిలకడ దుంపల్ని మెత్తగా ఉడికించి తినాలి. అలాగే నేరేడుపండ్ల రసం ప్రతిరోజూ రాత్రిపూట తాగితే రక్తవృద్ధి కలగడమేకాక శుద్ది కూడా అవుతుందట. సపోటా పండ్లు ప్రతిరోజూ క్రమంతప్పకుండా తిన్నా, టమోటాలను గింజ లేకుండా తీసి ఆ రసాన్ని ఉదయం పూట తాగితే రక్తవృద్ధికి కారకం అవుతుందట.
అంతేకాదు ద్రాక్షకు రక్తాన్ని శుభ్రపరిచే గుణం వుంది. ప్రతిరోజూ ఒక ఆపిల్ పండు తిన్నా రక్తం వృద్ధి చెంది శరీరానికి మంచి బలం చేకూర్చుతుందట. ఇలా తు.చ తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా ఆరోగ్యవంతులవుతారని వైద్యులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







