ఒకే సినిమాలో 3 పాత్రల్లో నటించనున్న విశాల్
- April 27, 2017
సీవీ కుమార్కు చెందిన ‘తిరుకుమరన్ ఎంటర్టైన్మెంట్’, అభినేష్ ఇళంగోకు చెందిన ‘అభి అండ్ అభి’ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నాళై నమదే’. దర్శకుడు పొన్రామ్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన వెంకటేశన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో విశాల్ మూడు పాత్రల్లో నటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. విశాల్కు జంటగా ఇద్దరు నాయికలు నటించనున్నారని, హాస్యపాత్రలో నటుడు సతీష్ నటించనున్నారని పేర్కొంది. భారీస్థాయిలో నిర్మించనున్న ఈ చిత్రంలో పలువురు అగ్రనటులు నటించనున్నారని తెలిపింది. ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. విశాల్ ప్రస్తుతం ‘తుప్పరివాళన్’, ‘ఇరుంబుతిరై’, ‘విలన్’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. ‘కరుప్పు రాజా వెళ్లె రాజా’ చిత్రంలో నటించడానికి ఆయన ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.
తాజా వార్తలు
- Saud bin Saqr receives Consul-General of Russian Federation
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?







