ఒకే సినిమాలో 3 పాత్రల్లో నటించనున్న విశాల్
- April 27, 2017
సీవీ కుమార్కు చెందిన ‘తిరుకుమరన్ ఎంటర్టైన్మెంట్’, అభినేష్ ఇళంగోకు చెందిన ‘అభి అండ్ అభి’ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నాళై నమదే’. దర్శకుడు పొన్రామ్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన వెంకటేశన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో విశాల్ మూడు పాత్రల్లో నటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. విశాల్కు జంటగా ఇద్దరు నాయికలు నటించనున్నారని, హాస్యపాత్రలో నటుడు సతీష్ నటించనున్నారని పేర్కొంది. భారీస్థాయిలో నిర్మించనున్న ఈ చిత్రంలో పలువురు అగ్రనటులు నటించనున్నారని తెలిపింది. ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. విశాల్ ప్రస్తుతం ‘తుప్పరివాళన్’, ‘ఇరుంబుతిరై’, ‘విలన్’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. ‘కరుప్పు రాజా వెళ్లె రాజా’ చిత్రంలో నటించడానికి ఆయన ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









