ఒకే సినిమాలో 3 పాత్రల్లో నటించనున్న విశాల్
- April 27, 2017
సీవీ కుమార్కు చెందిన ‘తిరుకుమరన్ ఎంటర్టైన్మెంట్’, అభినేష్ ఇళంగోకు చెందిన ‘అభి అండ్ అభి’ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నాళై నమదే’. దర్శకుడు పొన్రామ్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన వెంకటేశన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో విశాల్ మూడు పాత్రల్లో నటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. విశాల్కు జంటగా ఇద్దరు నాయికలు నటించనున్నారని, హాస్యపాత్రలో నటుడు సతీష్ నటించనున్నారని పేర్కొంది. భారీస్థాయిలో నిర్మించనున్న ఈ చిత్రంలో పలువురు అగ్రనటులు నటించనున్నారని తెలిపింది. ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. విశాల్ ప్రస్తుతం ‘తుప్పరివాళన్’, ‘ఇరుంబుతిరై’, ‘విలన్’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. ‘కరుప్పు రాజా వెళ్లె రాజా’ చిత్రంలో నటించడానికి ఆయన ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









