ఒకే సినిమాలో 3 పాత్రల్లో నటించనున్న విశాల్‌

- April 27, 2017 , by Maagulf
ఒకే సినిమాలో 3 పాత్రల్లో నటించనున్న విశాల్‌

సీవీ కుమార్‌కు చెందిన ‘తిరుకుమరన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’, అభినేష్‌ ఇళంగోకు చెందిన ‘అభి అండ్‌ అభి’ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నాళై నమదే’. దర్శకుడు పొన్‌రామ్‌ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన వెంకటేశన్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో విశాల్‌ మూడు పాత్రల్లో నటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. విశాల్‌కు జంటగా ఇద్దరు నాయికలు నటించనున్నారని, హాస్యపాత్రలో నటుడు సతీష్‌ నటించనున్నారని పేర్కొంది. భారీస్థాయిలో నిర్మించనున్న ఈ చిత్రంలో పలువురు అగ్రనటులు నటించనున్నారని తెలిపింది. ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. విశాల్‌ ప్రస్తుతం ‘తుప్పరివాళన్‌’, ‘ఇరుంబుతిరై’, ‘విలన్‌’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. ‘కరుప్పు రాజా వెళ్లె రాజా’ చిత్రంలో నటించడానికి ఆయన ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com