షార్జా లో ఎత్తైన భవనం నుంచి కింద పడీ మరణించిన 30 ఏళ్ళ వ్యక్తి

- April 28, 2017 , by Maagulf
షార్జా లో  ఎత్తైన భవనం నుంచి కింద పడీ మరణించిన 30 ఏళ్ళ వ్యక్తి

షార్జా:  నిర్మాణ దశలో ఉన్న 20 అంతస్తుల భవనం పైనుంచి కిందకు దూకి  ఓ ముప్పయేళ్ల వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయాడు. షార్జా ఆల్ మజాజ్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.  పోలీసు అధికారి "మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తమ దృష్టికి రాలేదని ఆయన తెలిపారు. అత్యవసర అధికారులకు సమాచారం తెల్సుకొని ఘటనా స్థలంకు వెళ్లారు. ఆ వ్యక్తి  సుమారు సాయంత్రం 5 గంటల సమయంలో చనిపోయి ఉంటాడని షార్జా పోలీసులు ధృవీకరించారు. 20 అంతస్థుల ఎత్తయిన భవనం నుంచి అనూహ్యంగా మరణించాడు.ప్రమాదం గురించి పోలీసులకు తెల్సిన వెంటనే, క్రిమినల్ అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంటు (సిఐడి) బృందం ఆ సన్నివేశానికి పంపబడింది. మృతదేహాన్ని గురువారం ఉదయం 6 గంటలకు అల్ కువైట్ ఆసుపత్రికి బదిలీ చేసారు, అప్పటికి మృతదేహం ఫోరెన్సిక్ ప్రయోగశాలకు తరలించబడింది. మరణించిన వ్యక్తి మరణం మిస్టరీ ఇంకా తెలియాల్సి ఉంది..అది ఆత్మహత్య లేక హత్య అనే విషయం విచారణలో ఇంకా తెలియాల్సిఉంది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com