షార్జా లో ఎత్తైన భవనం నుంచి కింద పడీ మరణించిన 30 ఏళ్ళ వ్యక్తి
- April 28, 2017
షార్జా: నిర్మాణ దశలో ఉన్న 20 అంతస్తుల భవనం పైనుంచి కిందకు దూకి ఓ ముప్పయేళ్ల వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయాడు. షార్జా ఆల్ మజాజ్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. పోలీసు అధికారి "మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తమ దృష్టికి రాలేదని ఆయన తెలిపారు. అత్యవసర అధికారులకు సమాచారం తెల్సుకొని ఘటనా స్థలంకు వెళ్లారు. ఆ వ్యక్తి సుమారు సాయంత్రం 5 గంటల సమయంలో చనిపోయి ఉంటాడని షార్జా పోలీసులు ధృవీకరించారు. 20 అంతస్థుల ఎత్తయిన భవనం నుంచి అనూహ్యంగా మరణించాడు.ప్రమాదం గురించి పోలీసులకు తెల్సిన వెంటనే, క్రిమినల్ అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంటు (సిఐడి) బృందం ఆ సన్నివేశానికి పంపబడింది. మృతదేహాన్ని గురువారం ఉదయం 6 గంటలకు అల్ కువైట్ ఆసుపత్రికి బదిలీ చేసారు, అప్పటికి మృతదేహం ఫోరెన్సిక్ ప్రయోగశాలకు తరలించబడింది. మరణించిన వ్యక్తి మరణం మిస్టరీ ఇంకా తెలియాల్సి ఉంది..అది ఆత్మహత్య లేక హత్య అనే విషయం విచారణలో ఇంకా తెలియాల్సిఉంది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
తాజా వార్తలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!
- ఇబ్రా, అల్ ముధైబి ఆరోగ్య కేంద్రాల్లో త్వరలో వైద్యసేవలు..!!









