అవయవాలు దానం బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి

- April 29, 2017 , by Maagulf
అవయవాలు దానం బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి

ప్రమాదంలో బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. యాదాద్రి జిల్లా భువనగిరి ఆత్మకూరుకు చెందిన శ్రీరాములు ఈనెల 30న ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రగాయాలతో ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం శ్రీరాములుకు బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో అతని కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. శ్రీరాములు కొడుకు ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఆయన కోరిక మేరకు అవయవదానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com