బ్రిటన్ నుంచి చైనా చేరుకున్న తొలిరైలు
- April 29, 2017
బ్రిటన్ నుంచి చైనాకు బయలుదేరిన తొలి గూడ్స్ రైలు 12వేల కిలోమీటర్లు ప్రయాణించి శనివారం చైనాలోని యివు నగరానికి చేరుకుంది. ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు మార్గాల్లో ఇది రెండోది. పశ్చిమ యూరప్తో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి చైనాకు ఈ రైలు మార్గం ఎంతగానో ఉపయోగపడనుంది. లండన్ నుంచి ఏప్రిల్ 10న బయలుదేరిన ఈ రైలు 20 రోజుల పాటు ఏడు దేశాల గుండా ప్రయాణించి చైనా చేరుకుంది. రైలు మార్గంలో ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, బెలారస్, రష్యా, కజకిస్థాన్ ఉన్నాయి. రైలులో వైన్, పాలు, ఔషధాలు, యంత్రాలు రవాణా అయ్యాయి. వస్తురవాణా కోసం చైనా రైల్వే కార్పొరేషన్ సమర్థమైన నెట్వర్క్ ఏర్పరుస్తోంది. ఈ నెట్వర్క్తో అనుసంధానమైన 15వ నగరం లండన్.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









