బ్రిటన్ నుంచి చైనా చేరుకున్న తొలిరైలు
- April 29, 2017
బ్రిటన్ నుంచి చైనాకు బయలుదేరిన తొలి గూడ్స్ రైలు 12వేల కిలోమీటర్లు ప్రయాణించి శనివారం చైనాలోని యివు నగరానికి చేరుకుంది. ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు మార్గాల్లో ఇది రెండోది. పశ్చిమ యూరప్తో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి చైనాకు ఈ రైలు మార్గం ఎంతగానో ఉపయోగపడనుంది. లండన్ నుంచి ఏప్రిల్ 10న బయలుదేరిన ఈ రైలు 20 రోజుల పాటు ఏడు దేశాల గుండా ప్రయాణించి చైనా చేరుకుంది. రైలు మార్గంలో ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, బెలారస్, రష్యా, కజకిస్థాన్ ఉన్నాయి. రైలులో వైన్, పాలు, ఔషధాలు, యంత్రాలు రవాణా అయ్యాయి. వస్తురవాణా కోసం చైనా రైల్వే కార్పొరేషన్ సమర్థమైన నెట్వర్క్ ఏర్పరుస్తోంది. ఈ నెట్వర్క్తో అనుసంధానమైన 15వ నగరం లండన్.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







