బ్రిటన్ నుంచి చైనా చేరుకున్న తొలిరైలు
- April 29, 2017
బ్రిటన్ నుంచి చైనాకు బయలుదేరిన తొలి గూడ్స్ రైలు 12వేల కిలోమీటర్లు ప్రయాణించి శనివారం చైనాలోని యివు నగరానికి చేరుకుంది. ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు మార్గాల్లో ఇది రెండోది. పశ్చిమ యూరప్తో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి చైనాకు ఈ రైలు మార్గం ఎంతగానో ఉపయోగపడనుంది. లండన్ నుంచి ఏప్రిల్ 10న బయలుదేరిన ఈ రైలు 20 రోజుల పాటు ఏడు దేశాల గుండా ప్రయాణించి చైనా చేరుకుంది. రైలు మార్గంలో ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, బెలారస్, రష్యా, కజకిస్థాన్ ఉన్నాయి. రైలులో వైన్, పాలు, ఔషధాలు, యంత్రాలు రవాణా అయ్యాయి. వస్తురవాణా కోసం చైనా రైల్వే కార్పొరేషన్ సమర్థమైన నెట్వర్క్ ఏర్పరుస్తోంది. ఈ నెట్వర్క్తో అనుసంధానమైన 15వ నగరం లండన్.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







