'రారండోయ్. వేడుక చూద్దాం' మే 13న ' ప్రీ-రిలీజ్
- April 29, 2017
ప్రేమమ్ చిత్రం తో సూపర్ హిట్ కొట్టిన నాగచైతన్య..తాజాగా రెండు సినిమాలను పూర్తి చేస్తున్నాడు..వాటిలో సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వం లో 'రారండోయ్. వేడుక చూద్దాం' ఒకటి. నాగ చైతన్య , రకుల్ ప్రీతి సింగ్ జంటగా నటిస్తున్న ఈ మూవీ ని అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ ఫై నాగార్జున నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. అంతకు ముందు మే 13 న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక చేయాలనీ ఫిక్స్ అయ్యారు. ఈ మధ్య మెగా హీరోలంత ఆడియో రిలీజ్ వేడుకలు చేయకుండా ప్రీ రిలీజ్ వేడుక చేసి వరుస సక్సెస్ లు అందుకుంటున్న నేపథ్యం లో ఈ సెంటిమెంట్ ను ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది.
''కుటుంబమంతా కలసి చూసే ఓ చక్కటి ప్రేమకథా చిత్రమిదని యూనిట్ చెపుతున్నారు. నాగార్జున కెరియర్లో 'నిన్నే పెళ్లాడతా' ఎలా ప్రత్యేక చిత్రంగా నిలిచిపోయిందో చైతూకి ఈ చిత్రం అంతలా తీపి గుర్తుంగా ఉండిపోతుందని డైరెక్టర్ అంటున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్లుక్కి మంచి స్పందన రావడం తో అంత హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. జగపతి బాబు ప్రత్యేక రోల్ లో కనిపిస్తుండగా ..సంపత్, కౌసల్య, ఇర్షాద్, చలపతిరావు, అన్నపూర్ణ, పోసాని, రఘుబాబు తదితరులు నటించారు. ఛాయాగ్రహణం: ఎస్.వి.విశ్వేశ్వర్, కూర్పు: గౌతంరాజు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్ : దేవి శ్రీ ప్రసాద్.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









