పవర్ కేబుల్స్ దొంగల ముఠా అరెస్ట్
- April 29, 2017
రస్ అల్ ఖైమా పోలీసులు, ఏడుగురు సభ్యుల ముఠాని అరెస్ట్ చేశారు. ఎమిరేట్తోపాటు పక్కనే ఉన్న ఇతర ఎమిరేట్స్ నుంచి పవర్ కేబుల్స్ దొంగిలిస్తున్న కేసులో వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. పట్టుబడ్డ దొంగల ముఠాలో అందరూ ఆసియా దేశాలకు చెందినవారేనని పోలీసులు వెల్లడించారు. రస్ అల్ ఖైమా పోలీస్, డైరెక్టర్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) బ్రిగేడియర్ అబ్దుల్లా మెనాఖాస్ మాట్లాడుతూ, శనివారం పవర్ కేబుల్స్ అలాగే కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ దొంగతనానికి సంబంధించి తమకు పలు ఫిర్యాదులు అందినట్లు వివరించారు. సెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేసి, విచారణ చేపట్టామనీ, దొరికిన ఆధారాలను విశ్లేషించి, నిందితుల్ని అరెస్ట్ చేశామని చెప్పారాయన. నిందితులపై పలు నేరాల కింద కేసులు ఉన్నట్లు విచారణలో గుర్తించారు. ఎమిరేట్ వ్యాప్తంగా జరిగిన 72 దొంగతనాల్లో ఈ ముఠా ప్రమేయం ఉంది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









