పవర్ కేబుల్స్ దొంగల ముఠా అరెస్ట్
- April 29, 2017
రస్ అల్ ఖైమా పోలీసులు, ఏడుగురు సభ్యుల ముఠాని అరెస్ట్ చేశారు. ఎమిరేట్తోపాటు పక్కనే ఉన్న ఇతర ఎమిరేట్స్ నుంచి పవర్ కేబుల్స్ దొంగిలిస్తున్న కేసులో వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. పట్టుబడ్డ దొంగల ముఠాలో అందరూ ఆసియా దేశాలకు చెందినవారేనని పోలీసులు వెల్లడించారు. రస్ అల్ ఖైమా పోలీస్, డైరెక్టర్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) బ్రిగేడియర్ అబ్దుల్లా మెనాఖాస్ మాట్లాడుతూ, శనివారం పవర్ కేబుల్స్ అలాగే కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ దొంగతనానికి సంబంధించి తమకు పలు ఫిర్యాదులు అందినట్లు వివరించారు. సెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేసి, విచారణ చేపట్టామనీ, దొరికిన ఆధారాలను విశ్లేషించి, నిందితుల్ని అరెస్ట్ చేశామని చెప్పారాయన. నిందితులపై పలు నేరాల కింద కేసులు ఉన్నట్లు విచారణలో గుర్తించారు. ఎమిరేట్ వ్యాప్తంగా జరిగిన 72 దొంగతనాల్లో ఈ ముఠా ప్రమేయం ఉంది.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







