వలసదారుల కమ్యూనిటీకి ఓ మంచి వ్యక్తిని కోల్పోయింది
- April 29, 2017అనుకోని సమస్యల్లో ఇరుక్కున్నవారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే అజీజ్ అనే మానవతావాది హఠాన్మరణం అందరినీ కలచివేసింది. టికె అజీజ్, 30 ఏళ్ళ క్రితం ఖతార్కి వచ్చి, ఇక్కడే నివసిస్తున్నారు. కేరళలోని కోజికోడ్కి చెందిన వ్యక్తి ఈయన. ఖతార్లో చనిపోయినవారిని స్వదేశాలకు పంపే గురుతర బాధ్యతను అజీజ్ తన భుజాన వేసుకునేవారు. ఆర్థిక సహాయం అందించడం, అలాగే ఇతరత్రా సహాయ సహకారాలు అందించడం ద్వారా ఖతార్లోని కేరళ కమ్యూనిటీకి అజీజ్ అత్యంత ఆప్తుడిగా మారారు. ఆయనమరణం తమను కలచివేసిందని ఐబిసిఎఫ్ ప్రెసిడెంట్ పి.ఎన్. బాబురాజన్ చెప్పారు. అజీజ్ మృతి పట్ల ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేస్తూ కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ ఖతార్, వచ్చేన నెలలో ఆయన గౌరవార్థం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. అజీజ్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







