ప్రపంచంలో చాక్లెట్ వినియోగంలో భారత్ ముందంజ
- April 30, 2017
ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న చాక్లెట్ మార్కెట్లలో భారత్ ముందంజలో ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాల్లో 13శాతం వృద్ధి నమోదు చేసిందని ఒక పరిశోధనలో వెల్లడైంది. లండన్కు చెందిన అంతర్జాతీయ సంస్థ మింటెల్ ఈ పరిశోధన నిర్వహించింది. మిగతా దేశాల్లో వీటి అమ్మకాలు స్తంభించిపోయాయని, 2016లో భారతీయులు 2,28,000 టన్నుల వినియోగించినట్లు పేర్కొంది. 2016లో ఆస్ట్రేలియా 95,000, ఇండోనేషియా 94,000 టన్నుల చాక్లెట్ను వినియోగించాయి. గతేడాదితో పోలిస్తే భారత్(13శాతం), పొలాండ్(2శాతం) మాత్రమే అంతర్జాతీయంగా అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేశాయి. 43శాతం మంది భారతీయులు చక్కెరతో తయారు చేసిన స్నాక్స్.. చాక్లెట్, కేక్లను మధ్యాహ్న భోజనం- రాత్రి భోజనం మధ్యలో తీసుకుంటున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం: సీఎం చంద్రబాబు
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక
- ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!
- కువైట్లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
- నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- తెలంగాణలో అపోలో ఫార్మసీ వెయ్యి స్టోర్ల మైలురాయి
- ఈ ప్రభుత్వం మీది..అండగా ఉంటాం: సీఎం రేవంత్
- ఇరాన్ పై దాడుల ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా విమానాల రద్దు
- వేట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్









