ప్రపంచంలో చాక్లెట్ వినియోగంలో భారత్ ముందంజ
- April 30, 2017
ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న చాక్లెట్ మార్కెట్లలో భారత్ ముందంజలో ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాల్లో 13శాతం వృద్ధి నమోదు చేసిందని ఒక పరిశోధనలో వెల్లడైంది. లండన్కు చెందిన అంతర్జాతీయ సంస్థ మింటెల్ ఈ పరిశోధన నిర్వహించింది. మిగతా దేశాల్లో వీటి అమ్మకాలు స్తంభించిపోయాయని, 2016లో భారతీయులు 2,28,000 టన్నుల వినియోగించినట్లు పేర్కొంది. 2016లో ఆస్ట్రేలియా 95,000, ఇండోనేషియా 94,000 టన్నుల చాక్లెట్ను వినియోగించాయి. గతేడాదితో పోలిస్తే భారత్(13శాతం), పొలాండ్(2శాతం) మాత్రమే అంతర్జాతీయంగా అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేశాయి. 43శాతం మంది భారతీయులు చక్కెరతో తయారు చేసిన స్నాక్స్.. చాక్లెట్, కేక్లను మధ్యాహ్న భోజనం- రాత్రి భోజనం మధ్యలో తీసుకుంటున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!









