ఒంటెలపై అల్ బతినా స్కూల్ విద్యార్థుల సందర్శన
- May 01, 2017
అల్ బతినా ఇంటర్నేషనల్ స్కూల్కి చెందిన గ్రేడ్ 7 స్టూడెంట్స్, ఒంటెలపై ఒమన్ అందాల్ని తిలకించే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. ఐదు రోజులపాటు వాడిస్, మౌంటెయిన్స్ వంటి చోట్లా వీరి ప్రయాణం సాగింది. అల్ ఖాన్ విలేజ్ నుంచి ట్రెక్కింగ్తో వీరి ప్రయాణం ప్రారంభమయ్యింది. అక్కడినుంచి అల్ తుక్బా మీదుగా వీరి ప్రయాణం సాగింది. కొండలపై క్యాంప్లు నిర్వహించారు. స్విమ్మింగ్, మైంటెయిన్ క్లైంబింగ్ వంటివాటి ద్వారా విద్యార్థులు అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. రాత్రి వేళల్లో క్యాంప్ల వద్ద సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. చివరగా విద్యార్థులు బురైమిలోని లాస్ట్ డ్యూన్స్కి పంపబడ్డారు. అక్కడే విద్యార్థులు మరింత ఉల్లాసంగా గడిపారు. క్యామెల్ నిర్వాహకులకీ, క్యామెల్స్కీ మధ్య అనుబంధాన్ని ఈ సందర్భంగా విద్యార్థులు తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!









