తెలుగుతేజం పీవీ సింధు బయెపిక్‌.. సోనూసూద్‌ నిర్మాత

- May 01, 2017 , by Maagulf
తెలుగుతేజం పీవీ సింధు బయెపిక్‌.. సోనూసూద్‌ నిర్మాత

 తెలుగుతేజం, ఒలింపిక్‌ రజత పతక విజేత పీవీ సింధు జీవిత కథ ఆధారంగా నటుడు సోనూసూద్‌ ఓ బయోపిక్‌ తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని సోనూసూద్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఎందరో భారతీయులకు స్ఫూర్తిగా నిలిచిన సింధు జీవితాన్ని వెండితెరపై చూపించబోతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఆమె జీవితం గురించి అందరూ తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఎనిమిది నెలల నుంచి ఈ బయోపిక్‌ గురించి చర్చిస్తున్నామని త్వరలో నటీనటుల వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
మరో పక్క బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై బాలీవుడ్‌లో బయోపిక్‌ రాబోతోంది. రీల్‌ లైఫ్‌ సైనా పాత్రలో బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ నటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com