మదీనా బాంబు దాడులకు సంబంధించి 46 అనుమానితులు అరెస్టు
- May 01, 2017
మదీనాలో ఉన్న ప్రొపేట్స్ మసీదులో విధ్వంసం చేయడానికి సౌదీకి వచ్చిన అల్-హరాజాత్కు చెందిన 46 మంది తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్లు మంత్రిత్వశాఖ ప్రతినిధి మేజర్ జనరల్ మన్సూర్ అల్-టర్కి ఆదివారం చెప్పారు. వారిలో 32 మంది సౌదీకి చెందిన వారు కావడం గమనార్హం. మిగతా 14 మంది పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్, జోర్డాన్, సూడాన్, ఈజిప్టులకు చెందినవారుగా గుర్తించమని పోలీసులు తెలిపారు. ప్రపంచంలో ముస్లీంలకు రెండో పవిత్ర స్థలమైన ప్రొఫెట్స్ మసీదులో భయానకవాతావరణం కల్పించేందుకు వారు మానామా వచ్చారని పోలీసులు తెలిపారు. జేడ్డాలో ఒక ఇంట్లో గదిని అద్దెకు తీసుకున్న ఇద్దరు వ్యక్తులు బాంబులు తయారు చేస్తున్నారని పోలీసులకు సమాచారమందింది. దాంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు.గత సంవత్సరం జూలైలో ప్రొఫెట్స్ మసీదులో సుసైడ్ బాంబర్ ఉపయోగించిన బాంబులు అక్కడే తయారు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారి కుట్ర బయటపడింది. దాదాపు రెండు సంవత్పరాలుగా తాము ఇదే పనిచేస్తున్నామని మసీదుల్లో అందరూ ప్రార్థనలు చేస్తుండగా బాంబులతో విరుచుకుపడాలని తమ నాయకుడు తమకు ఆదేశాలిచ్చాడని వారు పేర్కొన్నారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు పకడ్భంది చర్యలు చేపట్టి, మిగతా వారిని అరెస్ట్ చేశామన్నారు." మా భద్రతను కాపాడగలుగుతారు మరియు అన్ని సందర్భాల్లోనూ వ్యవహరించడానికి భద్రతా సిబ్బంది తగినంత వనరులను కలిగి ఉంటారని ఆల్-టర్కి చెప్పారు.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







