భారతీయ రైల్వే లో టూరిస్టులు 'మహారాజు'లా ఆ ట్రైన్ లో వెళ్ళొచ్చు...

- May 03, 2017 , by Maagulf
భారతీయ రైల్వే లో టూరిస్టులు 'మహారాజు'లా ఆ ట్రైన్ లో వెళ్ళొచ్చు...

ఈ ఏడాది వర్షాకాలంలో రైలు ప్రయాణికులకు, ముఖ్యంగా టూరిస్టులకు భారతీయ రైల్వే ఓ తీపి కబురు అందిస్తోంది. లగ్జరీ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో హాయిగా అన్ని సౌకర్యాలనూ అనుభవిస్తూ ప్రయాణించవచ్చు. మహారాజా ఎక్స్ ప్రెస్ రైల్లో సరదాగా ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేయవచ్చునని ఇండియన్ రైల్వే శాఖ ప్రకటించింది. రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తో కలిసి సంయుక్తంగా ఈ సరికొత్త ప్రమోషనల్ టూరిస్ట్ ప్రాజెక్ట్ చేపట్టింది.
టికెట్ కోసం ఫస్ట్ బుకింగ్ చేసుకున్న వ్యక్తికి ఒక టికెట్ (సీటు) ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు. సదర్న్ సో జర్న్, సదర్న్ జువెల్స్ పేరిట వ్యవహరిస్తున్న రెండు కొత్త రూట్లలో పశ్చిమ, దక్షిణ భారతావని లోని పలు ప్రాంతాలను విజిట్ చేయవచ్చు. సదర్న్ సో జర్న్ లో గోవా, హంపి, మైసూర్, ఎర్నాకులం, త్రివేండ్రం లను కవర్ చేస్తే.. సదర్న్ జువెల్స్ లో చెట్టి నాడ్, మహాబలిపురం, మైసూర్, హంపి, గోవా ఉన్నాయి. 8 రోజుల్లో ఈ నగరాలను సందర్శించవచ్చునని, ఈ ట్రావెల్స్ సందర్భంగా సైట్ సీయింగ్ విశేషాలను కూడా వివరించే గైడ్లు ఉంటారని రైల్వే శాఖవర్గాలు తెలిపాయి.
సదర్న్ సోజర్న్ సెప్టెంబర్ 9 న ముంబై నుంచి, సదర్న్ జువెల్స్ సెప్టెంబరు 16 న త్రివేండ్రం నుంచి ప్రారంభమవుతుందని ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రయాణాల్లో రెస్టారెంట్, బార్ వంటి సర్వీసులు కూడా ఉంటాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com