యూపీ లో దారుణం అమ్మాయిలు ఫోన్ మాట్లాడితే 21 వేల జరిమానా

- May 03, 2017 , by Maagulf
యూపీ లో దారుణం అమ్మాయిలు ఫోన్ మాట్లాడితే 21 వేల జరిమానా

ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో పంచాయతీ తీర్పులు కలకలం రేపుతున్నాయి. భారత దేశం ఇచ్చిన రాజ్యంగ  స్వేచ్ఛను హరించే విధంగా తీర్పులను వెలువరుస్తున్నాయి. ఆవులను చంపినా, మద్యం అమ్మకాలు చేపట్టినా, లేడీస్ వీధుల్లో ఫోన్‌ వాడినా భారీ ఫైన్ విధించేలా మడోరా గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ పంచాయతీ బుధవారం సంబంధిత ఆదేశాలు జారీచేసింది.
మడోరా గ్రామ కొత్త రూల్స్ ప్రకారం.. లేడీస్ స్ట్రీట్ లో ఫోన్ మాట్లాడుతూ... కన్పిస్తే వారికి రూ. 21వేల జరిమానా విధించనున్నారు. మహిళలపై నేరాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు పంచాయతీ అభిప్రాయపడింది. ఇక, గోవధకు పాల్పడినా.. ఆవులను దొంగతనం చేసినా రూ. 2లక్షల వరకు జరిమానా వేయనున్నారు. దీంతో పాటు మద్యం అమ్మకాలు చేపడితే.. రూ. 1.11లక్షల వరకు అపరాధ రుసుము కట్టేలా నిర్ణయం తీసుకున్నారు. జరిమానాలతో పాటు అవసరమైతే శిక్షలు కూడా విధిస్తారట. శిక్ష ఏంటనేది పంచాయతీనే నిర్ణయం తీసుకుంటుందట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com