యూపీ లో దారుణం అమ్మాయిలు ఫోన్ మాట్లాడితే 21 వేల జరిమానా
- May 03, 2017
ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో పంచాయతీ తీర్పులు కలకలం రేపుతున్నాయి. భారత దేశం ఇచ్చిన రాజ్యంగ స్వేచ్ఛను హరించే విధంగా తీర్పులను వెలువరుస్తున్నాయి. ఆవులను చంపినా, మద్యం అమ్మకాలు చేపట్టినా, లేడీస్ వీధుల్లో ఫోన్ వాడినా భారీ ఫైన్ విధించేలా మడోరా గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ పంచాయతీ బుధవారం సంబంధిత ఆదేశాలు జారీచేసింది.
మడోరా గ్రామ కొత్త రూల్స్ ప్రకారం.. లేడీస్ స్ట్రీట్ లో ఫోన్ మాట్లాడుతూ... కన్పిస్తే వారికి రూ. 21వేల జరిమానా విధించనున్నారు. మహిళలపై నేరాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు పంచాయతీ అభిప్రాయపడింది. ఇక, గోవధకు పాల్పడినా.. ఆవులను దొంగతనం చేసినా రూ. 2లక్షల వరకు జరిమానా వేయనున్నారు. దీంతో పాటు మద్యం అమ్మకాలు చేపడితే.. రూ. 1.11లక్షల వరకు అపరాధ రుసుము కట్టేలా నిర్ణయం తీసుకున్నారు. జరిమానాలతో పాటు అవసరమైతే శిక్షలు కూడా విధిస్తారట. శిక్ష ఏంటనేది పంచాయతీనే నిర్ణయం తీసుకుంటుందట.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







