అక్రమ వలస కార్మికులపై చర్యలు
- October 04, 2015
అమ్నెస్టీ గడువు ముగిసిన తర్వాత ఒమన్లో అక్రమంగా నివసిస్తున్న కార్మికులపై చర్యలు తప్పవని మానవ వనరుల మంత్రిత్వ అశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సరైన ధృవ పత్రాలు లేకుండా, అక్రమంగా దేశంలో నివసిస్తోన్న కార్మికులు అమ్నెస్టీ ముందుకు రావాలనీ, గడువు తర్వాత వారిపై చర్యలు తప్పవు గనుక, అమ్నెస్టీ సహకారం ఇప్పుడే తీసుకోవాలని మానవ వనరుల శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ అధికారి సలీమ్ సైద్ అల్ బాది చెప్పారు. మే 3న ప్రారంభమైన అమ్నెస్టీ, ఈ నెల 28 వరకూ అందుబాటులో ఉంటుంది. 23,618 మంది ఒమానీ కార్మికులు డాక్యుమెంట్లు లేకుండా ఉన్నారనీ, వీరిలో ఆమ్నెస్టీ ద్వారా 23,618 దేశాన్ని వీడారనీ, ఇంకా 2,279 మంది కార్మికులు అమ్నెస్టీ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉందన్నారు. అమ్నెస్టీ ప్రకటించినప్పుడు 50 వేల మంది కార్మికులు ఒమన్లో ఉంటున్నట్లుగా మూడు ఆసియా దేశాలు ప్రకటించాయి.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







