అక్రమ వలస కార్మికులపై చర్యలు

- October 04, 2015 , by Maagulf
అక్రమ వలస కార్మికులపై చర్యలు

అమ్నెస్టీ గడువు ముగిసిన తర్వాత ఒమన్‌లో అక్రమంగా నివసిస్తున్న కార్మికులపై చర్యలు తప్పవని మానవ వనరుల మంత్రిత్వ అశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సరైన ధృవ పత్రాలు లేకుండా, అక్రమంగా దేశంలో నివసిస్తోన్న కార్మికులు అమ్నెస్టీ ముందుకు రావాలనీ, గడువు తర్వాత వారిపై చర్యలు తప్పవు గనుక, అమ్నెస్టీ సహకారం ఇప్పుడే తీసుకోవాలని మానవ వనరుల శాఖకు చెందిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ లేబర్‌ వెల్ఫేర్‌ అధికారి సలీమ్‌ సైద్‌ అల్‌ బాది చెప్పారు. మే 3న ప్రారంభమైన అమ్నెస్టీ, ఈ నెల 28 వరకూ అందుబాటులో ఉంటుంది. 23,618 మంది ఒమానీ కార్మికులు డాక్యుమెంట్లు లేకుండా ఉన్నారనీ, వీరిలో ఆమ్నెస్టీ ద్వారా 23,618 దేశాన్ని వీడారనీ, ఇంకా 2,279 మంది కార్మికులు అమ్నెస్టీ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉందన్నారు. అమ్నెస్టీ ప్రకటించినప్పుడు 50 వేల మంది కార్మికులు ఒమన్‌లో ఉంటున్నట్లుగా మూడు ఆసియా దేశాలు ప్రకటించాయి. 

 

--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com