నమాజ్ కోసం మసీదుకు వెళ్లిన బాలుడి దారుణ హత్య
- May 05, 2017
నమాజ్ కోసం వెళ్లిన బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన బండ్లగూడలో కలకలం సృష్టించింది. గత నెల 27న జహంగీరాబాద్ కు చెదిన పన్నెండేళ్ల ఉరూజుద్పద్దీన్ నమాజు కోసం మసీదుకు వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. బాలుడిని ఇంటి పక్కనే ఉన్న మునీర్ కిడ్నాప్ చేసి హత్య చేశాడని గుర్తించారు.
మాయమాటలు చెప్పి చిన్నారిని తీసుకెళ్లిన మునీర్కు అతడి తల్లిదండ్రులను డబ్బు ఎలా డిమాండ్ చేయాలో తెలీలేదు. బాలుడిని తిరిగి తీసుకెళ్తతే తనపై కేసు నమోదు చేస్తారని భయపడ్డాడు. దీంతో చిన్నారి గొంతు నులుమి హత్య చేసి మృతదేహాన్ని మురికిగుంటలో పడేశాడు. పోలీసు విచారణలో నిజాలు వెల్లడించాడు. దీంతో గురువారం పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. బాలుడి మృతితో మహ్మద్ యావరుద్దీన్ కుటుంబంలో విషాదం అలుముకుంది.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







