అమెరికా శాన్ జోస్ లో ఎన్నారై దంపతుల హత్య

- May 06, 2017 , by Maagulf
అమెరికా శాన్ జోస్ లో ఎన్నారై దంపతుల హత్య

అమెరికాలో ఎన్నారై దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. శాన్ జోస్ లో భారత్ కు చెందిన నరేన్ ప్రభు దంపతులను.. మిర్జా టాట్లిక్ అనే అమెరికన్ కాల్చిచంపాడు. మిర్జా టాట్లిక్.. నరేన్ ప్రభు కుమార్తె రేచల్ ప్రభు మాజీ ప్రియుడు. విభేదాలతో రేచల్ ప్రభు, మిర్జా టాట్లిక్ విడిపోగా.. మీర్జా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తుపాకీతో ఇంట్లోకి చొరబడ్డ మిర్జా.. నరేన్ ప్రభుపై తూటాల వర్షం కురిపించాడు. అనంతరం అతని భార్య పైనా కాల్పులు జరిపాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని మట్టుబెట్టారు. మిర్జా టాట్లిక్ కు గతంలో కూడా క్రిమినల్ రికార్డ్ ఉందని.. పోలీస్ అధికారులు తెలిపారు. అయితే ఈ దాడి జరిగిన సమయంలో అతని మాజీ ప్రియురాలు రేచల్ ప్రభు.. శాన్ జోస్ లో లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com