అమెరికా శాన్ జోస్ లో ఎన్నారై దంపతుల హత్య
- May 06, 2017
అమెరికాలో ఎన్నారై దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. శాన్ జోస్ లో భారత్ కు చెందిన నరేన్ ప్రభు దంపతులను.. మిర్జా టాట్లిక్ అనే అమెరికన్ కాల్చిచంపాడు. మిర్జా టాట్లిక్.. నరేన్ ప్రభు కుమార్తె రేచల్ ప్రభు మాజీ ప్రియుడు. విభేదాలతో రేచల్ ప్రభు, మిర్జా టాట్లిక్ విడిపోగా.. మీర్జా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తుపాకీతో ఇంట్లోకి చొరబడ్డ మిర్జా.. నరేన్ ప్రభుపై తూటాల వర్షం కురిపించాడు. అనంతరం అతని భార్య పైనా కాల్పులు జరిపాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని మట్టుబెట్టారు. మిర్జా టాట్లిక్ కు గతంలో కూడా క్రిమినల్ రికార్డ్ ఉందని.. పోలీస్ అధికారులు తెలిపారు. అయితే ఈ దాడి జరిగిన సమయంలో అతని మాజీ ప్రియురాలు రేచల్ ప్రభు.. శాన్ జోస్ లో లేదు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







