అమెరికా శాన్ జోస్ లో ఎన్నారై దంపతుల హత్య
- May 06, 2017
అమెరికాలో ఎన్నారై దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. శాన్ జోస్ లో భారత్ కు చెందిన నరేన్ ప్రభు దంపతులను.. మిర్జా టాట్లిక్ అనే అమెరికన్ కాల్చిచంపాడు. మిర్జా టాట్లిక్.. నరేన్ ప్రభు కుమార్తె రేచల్ ప్రభు మాజీ ప్రియుడు. విభేదాలతో రేచల్ ప్రభు, మిర్జా టాట్లిక్ విడిపోగా.. మీర్జా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తుపాకీతో ఇంట్లోకి చొరబడ్డ మిర్జా.. నరేన్ ప్రభుపై తూటాల వర్షం కురిపించాడు. అనంతరం అతని భార్య పైనా కాల్పులు జరిపాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని మట్టుబెట్టారు. మిర్జా టాట్లిక్ కు గతంలో కూడా క్రిమినల్ రికార్డ్ ఉందని.. పోలీస్ అధికారులు తెలిపారు. అయితే ఈ దాడి జరిగిన సమయంలో అతని మాజీ ప్రియురాలు రేచల్ ప్రభు.. శాన్ జోస్ లో లేదు.
తాజా వార్తలు
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!









