వేసవిలో కళ్లు మంటలా... ఇలా చేయండి
- May 06, 2017
ఏటుకేడు వేసవి ఎండ తీవ్రత పెరుగుతోంది. ఈ సంవత్సరం మరీ ఎక్కువ స్థాయిలో ఉంది. దీనికి కాలుష్యం ఒక కారణం. దీని స్థాయి పెరిగే కొద్దీ అతినీలలోహిత కిరణాలు భూమిని తాకడం ఎక్కువైంది. దీనివల్ల కంటికి, చర్మానికి సంబంధించిన వ్యాధులు పెరుగుతున్నాయి. ఈ వేసవిలో ఇప్పటికే వేడి వల్ల 30% శాతం వరకు కంటి సమస్యల కేసులు పెరిగాయని కంటి వైద్యులు చెబుతున్నారు.
ముఖ్యంగా కన్నులు మంట కలిగి ఎరుపు రంగులోకి మారడం, దురదగా ఉండటం, కన్నులు ఎరుపుగా ఉండి కనురెప్పలు వాచినట్టు ఉండడం మొదలైనవి వేడి వల్ల కలిగే లక్షణాలు. దీని నుండి ఉపశమనం పొందాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ సమయం ఎండలో తిరగడం, ప్రయాణించడం, కష్టంతో కూడిన పని చేయడం వంటివి తగ్గించాలి. అవసరం ఉంటేనే బయటకు రావాలి, వీలైతే సన్గ్లాసులు వాడండి.
తలపై టోపీ లేదా రుమాలు ధరించండి. క్రమం తప్పకుండా తలకు నూనె రాయాలి. కంటికి చుక్కల మందు వేసుకోవాలి. ఒక టీ బ్యాగ్ని తీసుకొని చల్లటి నీళ్లలో ముంచి కనురెప్పల మీద 10-15 నిమిషాల పాటు ఉంచుకొని ముఖం కడుక్కోవాలి. ఇలా రోజులో 2-3 సార్లు చేస్తే కళ్ల మంటలు తగ్గుతాయి. సమస్య తీవ్రం అయ్యేట్లు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







