యూఏఈ సెలూన్లో 'సెల్ఫీ' గొడవ
- May 08, 2017
షార్జాలోని ఓ సెలూన్లో 'సెల్ఫీ' గొడవ జరిగింది. ముగ్గురు అరబ్ మహిళలు, జిసిసి మహిళ ఒకరిపై దాడి చేశారు. ఓ పార్టీకి వెళ్ళేందుకోసం సెలూన్కి వచ్చిన మహిళలు, సెల్ఫీ తీసుకుంటుండగా ఈ గొడవ జరిగింది. జిసిసి మహిళ వెనకాల నిలబడి ఉన్న సమయంలో ఆ ముగ్గురు మహిళలు సెల్ఫీ తీసుకోవడం వివాదాస్పదమయ్యింది. సెలూన్ నిర్వాహకులు ఎంత సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా 'జగడం' ఆగలేదు. ఈ ఘటనలో జిసిసి మహిళ బొటనవేలికి గాయమయ్యింది. అలాగే ఆమె శరీరంపైనా చిన్న చిన్న గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించడం జరిగింది. అరబ్ మహిళలు తీసుకున్న సెల్ఫీలో తన ఫొటో ఉండడంపై జిసిసి మహిళ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఆమె అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకోకుండా దురుసుగా వ్యవహరించిన అరబ్ మహిళలు ఈ ఘటనకు బాధ్యులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









