యూఏఈ సెలూన్లో 'సెల్ఫీ' గొడవ
- May 08, 2017
షార్జాలోని ఓ సెలూన్లో 'సెల్ఫీ' గొడవ జరిగింది. ముగ్గురు అరబ్ మహిళలు, జిసిసి మహిళ ఒకరిపై దాడి చేశారు. ఓ పార్టీకి వెళ్ళేందుకోసం సెలూన్కి వచ్చిన మహిళలు, సెల్ఫీ తీసుకుంటుండగా ఈ గొడవ జరిగింది. జిసిసి మహిళ వెనకాల నిలబడి ఉన్న సమయంలో ఆ ముగ్గురు మహిళలు సెల్ఫీ తీసుకోవడం వివాదాస్పదమయ్యింది. సెలూన్ నిర్వాహకులు ఎంత సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా 'జగడం' ఆగలేదు. ఈ ఘటనలో జిసిసి మహిళ బొటనవేలికి గాయమయ్యింది. అలాగే ఆమె శరీరంపైనా చిన్న చిన్న గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించడం జరిగింది. అరబ్ మహిళలు తీసుకున్న సెల్ఫీలో తన ఫొటో ఉండడంపై జిసిసి మహిళ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఆమె అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకోకుండా దురుసుగా వ్యవహరించిన అరబ్ మహిళలు ఈ ఘటనకు బాధ్యులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







