ఇ-సర్వీసెస్‌ని ప్రారంభించిన రియాద్‌ గవర్నర్‌

- May 09, 2017 , by Maagulf
ఇ-సర్వీసెస్‌ని ప్రారంభించిన రియాద్‌ గవర్నర్‌

రియాద్‌: ఇంటీరియర్‌ మినిస్ట్రీ, ఇ-సర్వీసెస్‌ ప్యాకేజీని ఇంప్లిమెంట్‌ చేయడంలో వేగం ప్రదర్శిస్తోంది. స్ట్రాటజీ అండ్‌ గవర్నెన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మరియు హ్యూమన్‌ రీసోర్సెస్‌ వంటి విభాగాల్లో ఇ-సర్వీసెస్‌ని అమలు చేయతలపెట్టారు. ఇన్‌స్టిట్యూషనల్‌ కమ్యూనికేషన్‌, ఫాలో అప్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ మరియు ఛేంజ్‌ వంటి వాటినీ ఈ ప్రాజెక్ట్‌లో చేర్చారు. రియాద్‌ గవర్నర్‌ప్రిన్స్‌ ఫైసల్‌ బిన్‌ బందర్‌ ఈ ప్రోగ్రామ్‌ని లాంఛ్‌ చేశారు. ఈ ప్రాజెక్ట్‌ తొలి ఫేజ్‌ గత ఏడాది ప్రారంభమయ్యింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాసెసింగ్‌ని ప్రధానంగా ఎలక్ట్రానిక్‌ సర్వీసుల్లో ఉపయోగించేందుకు వీలుగా డిజైన్‌ చేశారు. మొత్తం 33 ఇ-సర్వీసుల్లో 18 పౌరుల కోసం, 15 నివాసితులకోసం రూపొందించారు. ఇంటీరియర్‌ మినిస్ట్రీ అండర్‌ సెక్రెటరీ అహ్మద్‌ బిన్‌ ముహమ్మద్‌ అల్‌ సలెమ్‌, రియాద్‌ ఎమిరేట్‌ అండర్‌ సెక్రెటరీ నాజర్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ దౌద్‌ తదితరులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com