శ్రీలంకకు చేరుకున్నభారత్ ప్రధాని

- May 11, 2017 , by Maagulf
శ్రీలంకకు చేరుకున్నభారత్ ప్రధాని

భారత ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితమే శ్రీలంకకు చేరుకున్నారు. శ్రీలంకలో మోడీ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. బౌద్ధులు నిర్వహిస్తున్న అంతర్జాతీయ వేసక్‌ (సింహళీయుల బౌద్ధ పూర్ణిమ) ఉత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. శుక్ర, శనివారాల్లో నిర్వహించే ఈ వేడుకలకు సుమారు వంద దేశాల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. శ్రీలంకలో పర్యటన సందర్భంగా మోడీ అక్కడి తేయాకు తోటలకు ప్రసిద్ధి గాంచిన కేండీ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. అలాగే భారత్‌ సహకారంతో కొలంబోలో నిర్మించిన ఆస్పత్రిని ప్రారంభించనున్నారు. శ్రీలంక నేతలతోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com