ముగిసిన ఏపీ సీఎం అమెరికా పర్యటన

- May 11, 2017 , by Maagulf
ముగిసిన ఏపీ సీఎం  అమెరికా పర్యటన

ముఖ్యమంత్రి చంద్రబాబు వారం రోజుల అమెరి కా పర్యటన ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నానికి ఆయన అమరావతికి చేరుకుంటారని సీఎంవో అధికారు లు వెల్లడించారు. తన వారం రోజుల పర్యటన విజయవంతమయ్యిందని, ఏడు రోజుల్లో ఏడు వేల కిలోమీటర్లు ప్రయాణిం చినట్లు ముఖ్యమంత్రి ట్వీటర్లో పేర్కొన్నారు. అమెరికాలో ఐదు నగరాలను సందర్శించి, 30కి పైగా సమావేశాల్లో పాల్గొన్నానని, 90కి పైగా కంపెనీల ప్రముఖలను కలసినట్లు తెలిపా రు. తన పర్యటన ద్వారా విద్య, వైద్యం, ఫిన్‌టెక్, హార్డ్‌వేర్, ఐటీ, ఇంటర్నెట్‌ రంగాల్లో 12,500 మందికి ఉపాధి లభించనుం దన్నారు. ఇలావుండగా అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధిగా ఎన్నికైన తొలి దక్షిణ భారతీయుడు రాజా కృష్ణమూర్తిని గురువారం కలసిన చంద్రబాబు అమరావతి సందర్శించాల్సిందిగా కోరారు. అనంతరం చికాగాలో తెలుగు అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com