ముగిసిన ఏపీ సీఎం అమెరికా పర్యటన
- May 11, 2017
ముఖ్యమంత్రి చంద్రబాబు వారం రోజుల అమెరి కా పర్యటన ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నానికి ఆయన అమరావతికి చేరుకుంటారని సీఎంవో అధికారు లు వెల్లడించారు. తన వారం రోజుల పర్యటన విజయవంతమయ్యిందని, ఏడు రోజుల్లో ఏడు వేల కిలోమీటర్లు ప్రయాణిం చినట్లు ముఖ్యమంత్రి ట్వీటర్లో పేర్కొన్నారు. అమెరికాలో ఐదు నగరాలను సందర్శించి, 30కి పైగా సమావేశాల్లో పాల్గొన్నానని, 90కి పైగా కంపెనీల ప్రముఖలను కలసినట్లు తెలిపా రు. తన పర్యటన ద్వారా విద్య, వైద్యం, ఫిన్టెక్, హార్డ్వేర్, ఐటీ, ఇంటర్నెట్ రంగాల్లో 12,500 మందికి ఉపాధి లభించనుం దన్నారు. ఇలావుండగా అమెరికా కాంగ్రెస్ ప్రతినిధిగా ఎన్నికైన తొలి దక్షిణ భారతీయుడు రాజా కృష్ణమూర్తిని గురువారం కలసిన చంద్రబాబు అమరావతి సందర్శించాల్సిందిగా కోరారు. అనంతరం చికాగాలో తెలుగు అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







