విదేశాల నుంచి బంగారాన్ని చాక్లెట్ పెట్టెలో పసిడి రేకులు
- May 11, 2017
విదేశాల నుంచి బంగారాన్ని అడ్డదారిలో తరలించడానికి స్మగ్లర్లు ఎత్తుకుపైఎత్తు వేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ ప్రయాణికుడు బంగారాన్ని పలచని రేకుగా మార్చి చాక్లెట్ డబ్బాల అంచులో పెట్టి తరలిస్తూ అడ్డంగా దొరికాడు. కస్టమ్స్ అధికారులు తెలిపిన కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఓ వ్యక్తి గురువారం అబుదాబి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగాడు. 423 గ్రాముల పసిడిని పలుచని రేకులుగా మార్చి.. వాటిని రెండు చాక్లెట్ బాక్సుల్లో.. ఓ ఫేస్క్రీమ్ బాక్సు లోపలి భాగం అంచులో దాచాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చి కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సామగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. చాక్లెట్ బాక్సులు, ఫేస్క్రీమ్ బాక్సులో బంగారు రేకులను గుర్తించారు.దాదాపు రూ.12 లక్షల విలువైన బంగారు రేకులను స్వాధీనం చేసుకున్నారు. సమగ్ర విచారణ కోసం నిందితుణ్ని కస్టమ్స్ ప్రధాన కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్









