28 కొత్త బ్రాంచ్లను ప్రారంభించనున్న 'క్యు పోస్ట్'
- May 12, 2017ఖతార్ పోస్ట్, కొత్తగా ఖతార్లో 28 కొత్త బ్రాంచ్లు అలాగే 10 కొత్త స్మార్ట్ లాకర్స్ని ప్రారంభించనుంది. ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో వినియోగదారుల కోసం వీటిని ఏర్పాటు చేస్తారు. 40 చదరపు మీటర్ల వైశాల్యంతో కొత్తగా స్టోరింగ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో వుంది. క్యు పోస్ట్ 'డిజిటల్ మెయిల్రూమ్ సొల్యూషన్స్' సర్వీస్ - డిజిటైజేషన్ సొల్యూషన్ ద్వారా డాక్యుమెంట్ ఆర్కైవింగ్, కంపిలెన్స్ మేనేజ్మెంట్ సౌకర్యాల్ని కల్పించనుంది. వర్క్ షాప్లో క్యు పోస్ట్ వర్గాలు భవిష్యత్ ప్లాన్స్ని వివరించాయి. డిజిటల్ టచ్ పాయింట్స్ని వినియోగదారులకు వేగవంతమైన సేవలు అందించేందుకోసం ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఖతార్ పోస్ట్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ హెడ్ మౌద్ డేనియల్ మాట్లాడుతూ, కొత్త బ్రాంచ్లు వినియోగదారులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. త్వరలో కస్టమర్ ఫ్రెండ్లీ మొబైల్ యాప్ని కూడా ప్రారంభించనున్నట్లు వివరించారామె. ఖతార్ పోస్ట్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఫలెమ్ అల్ నయీమి సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







