28 కొత్త బ్రాంచ్లను ప్రారంభించనున్న 'క్యు పోస్ట్'
- May 12, 2017ఖతార్ పోస్ట్, కొత్తగా ఖతార్లో 28 కొత్త బ్రాంచ్లు అలాగే 10 కొత్త స్మార్ట్ లాకర్స్ని ప్రారంభించనుంది. ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో వినియోగదారుల కోసం వీటిని ఏర్పాటు చేస్తారు. 40 చదరపు మీటర్ల వైశాల్యంతో కొత్తగా స్టోరింగ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో వుంది. క్యు పోస్ట్ 'డిజిటల్ మెయిల్రూమ్ సొల్యూషన్స్' సర్వీస్ - డిజిటైజేషన్ సొల్యూషన్ ద్వారా డాక్యుమెంట్ ఆర్కైవింగ్, కంపిలెన్స్ మేనేజ్మెంట్ సౌకర్యాల్ని కల్పించనుంది. వర్క్ షాప్లో క్యు పోస్ట్ వర్గాలు భవిష్యత్ ప్లాన్స్ని వివరించాయి. డిజిటల్ టచ్ పాయింట్స్ని వినియోగదారులకు వేగవంతమైన సేవలు అందించేందుకోసం ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఖతార్ పోస్ట్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ హెడ్ మౌద్ డేనియల్ మాట్లాడుతూ, కొత్త బ్రాంచ్లు వినియోగదారులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. త్వరలో కస్టమర్ ఫ్రెండ్లీ మొబైల్ యాప్ని కూడా ప్రారంభించనున్నట్లు వివరించారామె. ఖతార్ పోస్ట్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఫలెమ్ అల్ నయీమి సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









