మక్కా అగ్నిప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి
- May 12, 2017
ఇటీవల ఎడారి దేశాలలో అగ్నిప్రమాదాలు జోరందుకొని నిండు ప్రాణాలను సజీవ దహనం చేస్తున్నాయి. మక్కాలోని ఒక వడ్రంగి గిడ్డంగిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు కార్మికులు కాలి బుగ్గిగా మారేరు. అగ్నిప్రమాద సమాచారం తెలియడం గానే సివిల్ డిఫెన్స్ బృందాలు హజ్ వీధిలోని ఘటనా స్థలానికి తరలించారు.అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను నియంత్రణలోనికి తీసుకొచ్చారు. భవనం లోని రెండో అంతస్తులో ఉన్నగిడ్డంగి లోపల అగ్నిప్రమాదం జరిగింది. ఇనుప లోహంతో నిర్మించిన ఒక గదిలో కార్మికులు ఆదమరిచి నిద్రపోతున్నారు. ఒక్కసారిగా అగ్నిజ్వాలలు ఆ ప్రాంతాంన్ని ఒక్కసారిగా చుట్టిముట్టాయి. కార్మికులు నిద్రిస్తున్న ఆ గది లోపలకు వెళ్లేందుకు వచ్చేందుకు కేవలం ఒకే ఒక ఇనుప నిచ్చెన మాత్రమే ఉంది. దీనితో భగ భగలాడుతూ తరుముకొస్తున్న మృత్యువుని తప్పించుకోలేకపోయారు. ఈ అగ్నిప్రమాదం జరిగినపుడు ఆ ఇనుప గదిలో విపరీతమైన వేడి పెరిగి ఆ ముగ్గురు కార్మికులు అక్కడే చనిపోయినట్లు సివిల్ డిఫెన్స్ ప్రతినిధి మేజ్ నయిఫ్ అల్-షరీఫ్ " మా గల్ఫ్ డాట్ కామ్ " ప్రతినిధికి తెలిపారు. అలాగే , ఈ అగ్నిప్రమాదం జరగడానికి గల వాస్తవ కారణం అన్వేషణ కోసం దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









