ప్రపంచవ్యాప్తంగా సైబర్ అటాక్
- May 13, 2017
ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సైబర్ అటాక్ జరిగింది. దాదాపు 100 దేశాల్లో కంప్యూటర్లపై హ్యాకర్లు విరుచుకుపడ్డారు. ఫలితంగా ప్రపంచం వ్యాప్తంగా సమాచార, ఐటీ, బ్యాంకింగ్, ఎయిర్ లైన్స్ రంగాలు స్థంభించిపోయే పరిస్థితి దాపురించింది. లండన్ లో వైద్య ఆరోగ్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని 25 శాతం పోలీస్ వ్యవస్థకు చెందిన కంప్యూటర్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్టు ర్యాన్సమ్ వేర్ ప్రకటించింది.
సరికొత్త మాల్ వేర్ తో హ్యాకర్లు అటాక్ చేసినట్టు తెలుస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ దాడిగా ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఈ సైబర్ అటాక్ బారిన అమెరికా, రష్యా, బ్రిటన్, ఇతర యూరోపియన్ దేశాలు, చైనా తదితర దేశాలు ఉన్నాయని తెలుస్తోంది.కంప్యూటర్ ఓపెన్ చెయ్యగానే ఒక మెసేజ్ వస్తోందని, అది ఓపెన్ చేయ్యగానే...కంప్యూటర్ మొత్తం కోడింగ్ లోకి మారిపోతోందట. కంఫ్యూటర్ మామూలు స్థితికి రావాలంటే డబ్బులు కట్టాలని మెసేజ్ కూడా వస్తోంది. దీంతో దీనిని డీ కోడ్ చేసేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు.
కంఫ్యూటర్ల హ్యాకింగ్ గురించి ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు స్పందించారు. తన కంఫ్యూటర్ హ్యాక్ కాలేదన్నారు. ఐవోఎస్ వాడుతున్నందున హ్యాకింగ్కు ఆస్కారం లేదన్న ఆయన, విండోస్ వాడుతున్న కంప్యూటర్లు హ్యాక్ అయినట్లు నిర్ధారణకు వచ్చినట్టు చెప్పారు. మరోవైపు, దేశ వ్యాప్తంగా హ్యాక్కు గురైన కంప్యూటర్ల డీ కోడింగ్కు పోలీస్ శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







