ఉత్తర, ముహారక్ గవర్నరేట్స్ లో రెండు పాఠశాలలపై తీవ్రవాదుల దాడి
- May 13, 2017
మనామ: ఉత్తర ముహరక్క్ గవర్నరేట్స్ పరిధిలోని రెండు పాఠశాలలపై ఉగ్రవాదులు దాడి జరిగినట్లు విద్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది."అర్రాడ్ ప్రాథమిక బాలుర పాఠశాల మరియు కరనా ప్రాథమిక బాలికల పాఠశాలలపై తీవ్రవాదులు దాడి చేశాయి, ఈ దాడితో ప్రభుత్వ పాఠశాలల్లో తీవ్రవాద దాడుల సంఖ్య 555 కు తీసుకువచ్చారని పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ డైరెక్టరేట్ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇస్లాం మతం మరియు అన్ని అంతర్జాతీయ సమావేశాలు మరియు మానవత్వ నియమాలకు విరుద్ధంగా పిల్లలను చదువుకోనీయకుండా విద్యకు వారి స్వాభావిక హక్కును పొందకుండా విద్యార్థులను అడ్డుకునే లక్ష్యంతో ఈ "అవమానకరమైన చర్యల" కొనసాగింపుకు వ్యతిరేకంగా మంత్రిత్వ శాఖ తన బలమైన అసంతృప్తి వ్యక్తం చేసింది. తీవ్రవాదులు ఆరాడ్ పాఠశాలలో చొరబడి, జిమ్నాజియం లోని అద్దాల ద్వారాన్ని పగలగొట్టారు. అదేవిధంగా కరానాలో తరగతి గదుల్లో కిటికీలను రాళ్ళతో ధ్వంసం చేశారని డైరెక్టరేట్ తెలిపింది, ఇటీవల జరిగిన ఈ సంఘటనలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ రెండు దాడుల గురించి భద్రతా అధికారులకు మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







