స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కారు ధ్వంసం: పోలీస్ స్టేషన్లో పంచాయితీ!
- May 14, 2017
అల్లు అర్జున్ కారు ధ్వంసం కేసుకు సంబంధించి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన పంచాయితీ హాట్ టాపిక్ అయింది. అల్లు అర్జున్ కారును ఢీ కొట్టిన క్యాబ్ డ్రైవర్.... డబ్బులు కట్టమని అడిగితే పోలీసులను ఆశ్రయించడమే ఈ పంచాయితీకి కారణం.
అల్లు అర్జున్ కారును శనివారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నెం.1 నుంచి వెళ్తుండగా ఓ క్యాబ్ వెనక్కి తీసే క్రమంలో ఆయన కారుకు తగిలింది. కారు ధ్వంసం అయింది కాబట్టి మరమ్మత్తులకు డబ్బులు ఇవ్వాలంటూ.... అల్లు అర్జున్ కారు డ్రైవర్ మహిపాల్ క్యాబ్ డ్రైవర్ రామకృష్ణను రూ. 2 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం.
ఇపుడు తన వద్ద డబ్బులు లేని, ఆదివారం ఉదయం వచ్చి డబ్బులు ఇస్తానని సదరు క్యాబ్ డ్రైవర్ తన క్యాబ్ ను అల్లు అర్జున్ ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు.
కారు మరమ్మత్తు ఖర్చు రూ.2 లక్షలు అవుతుందని మహిపాల్ తెలపడంతో అంత చెల్లించుకోలేనని చెప్పిన రామకృష్ణ ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ ను ఆశ్రయించాడు. అల్లు అర్జున్ కారు డ్రైవర్ తనను డబ్బుల కోసం ఇబ్బంది పెడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.
అంత సీరియస్ ఇష్యూ కాక పోవడంతో రామకృష్ణ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. మహిపాల్ను పోలీస్స్టేషన్కు పిలిపించి ఇద్దరు డ్రైవర్లతో మాట్లాడారు ఎలాంటి కేసు లేకుండా ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ జోక్యం చేసుకున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







