స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కారు ధ్వంసం: పోలీస్ స్టేషన్లో పంచాయితీ!
- May 14, 2017
అల్లు అర్జున్ కారు ధ్వంసం కేసుకు సంబంధించి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన పంచాయితీ హాట్ టాపిక్ అయింది. అల్లు అర్జున్ కారును ఢీ కొట్టిన క్యాబ్ డ్రైవర్.... డబ్బులు కట్టమని అడిగితే పోలీసులను ఆశ్రయించడమే ఈ పంచాయితీకి కారణం.
అల్లు అర్జున్ కారును శనివారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నెం.1 నుంచి వెళ్తుండగా ఓ క్యాబ్ వెనక్కి తీసే క్రమంలో ఆయన కారుకు తగిలింది. కారు ధ్వంసం అయింది కాబట్టి మరమ్మత్తులకు డబ్బులు ఇవ్వాలంటూ.... అల్లు అర్జున్ కారు డ్రైవర్ మహిపాల్ క్యాబ్ డ్రైవర్ రామకృష్ణను రూ. 2 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం.
ఇపుడు తన వద్ద డబ్బులు లేని, ఆదివారం ఉదయం వచ్చి డబ్బులు ఇస్తానని సదరు క్యాబ్ డ్రైవర్ తన క్యాబ్ ను అల్లు అర్జున్ ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు.
కారు మరమ్మత్తు ఖర్చు రూ.2 లక్షలు అవుతుందని మహిపాల్ తెలపడంతో అంత చెల్లించుకోలేనని చెప్పిన రామకృష్ణ ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ ను ఆశ్రయించాడు. అల్లు అర్జున్ కారు డ్రైవర్ తనను డబ్బుల కోసం ఇబ్బంది పెడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.
అంత సీరియస్ ఇష్యూ కాక పోవడంతో రామకృష్ణ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. మహిపాల్ను పోలీస్స్టేషన్కు పిలిపించి ఇద్దరు డ్రైవర్లతో మాట్లాడారు ఎలాంటి కేసు లేకుండా ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ జోక్యం చేసుకున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









