రాఘవేంద్ర తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో శర్వానంద్ సినిమా
- May 14, 2017
బహుబలి వంటి సినిమాని అత్యంత సుందరంగా నిర్మాత్మక విలువలతో తెరకెక్కించిన సంస్థ బాహుబలి తో హిస్టరీ క్రియేట్ చెయ్యడమే కాదు.. సక్సెస్ తో విమర్శకుల ప్రశంసలను కూడా అందుకొన్నారు. కాగా ఈ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా అధినేతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ లు నిర్మించే నెక్స్ట్ మూవీ వివరాల్లోకి వెళ్తే...
ఒక తెలుగు సినిమాకి యాభై కోట్లు బడ్జెట్ పెట్టడం అంటేనే సాహసం గా చెప్పుకునే టైమ్ లో, రెండు సినిమాల కోసం దాదాపు 500ల కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్. ఆర్కా మీడియా బ్యానర్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్ క్లూజన్ చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చెరిగిన పోని రికార్డులు అందుకొన్నాయి. బాహుబలి లాంటి సినిమాల తర్వాత ఆర్యా మీడియా బ్యానర్లో ఎలాంటి సినిమా రాబోతుంది. అనే ప్రశ్నకి సమాధానం వచ్చేసింది. ఈ నిర్మాతలు కూడా ఈ సారి చిన్న సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ఆర్యా మీడియా నెక్ట్స్ మూవీ చేయబోతుంది. ప్రకాష్ కోవెలమూడి డైరెక్షన్లో బాహుబలి నిర్మాతలు చేయబోయే సినిమాలో హీరోగా నటించబోయేది శర్వానంద్. వరసు విజయాలు అందుకుంటూ సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటున్న శర్వానంద్ ని, తమ హీరోగా ఫిక్స్ చేసుకున్నారు శోభు యార్లగడ్డ అండ్ దేవినేని ప్రసాద్. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళబోతుంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







