రాఘవేంద్ర తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో శర్వానంద్ సినిమా
- May 14, 2017
బహుబలి వంటి సినిమాని అత్యంత సుందరంగా నిర్మాత్మక విలువలతో తెరకెక్కించిన సంస్థ బాహుబలి తో హిస్టరీ క్రియేట్ చెయ్యడమే కాదు.. సక్సెస్ తో విమర్శకుల ప్రశంసలను కూడా అందుకొన్నారు. కాగా ఈ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా అధినేతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ లు నిర్మించే నెక్స్ట్ మూవీ వివరాల్లోకి వెళ్తే...
ఒక తెలుగు సినిమాకి యాభై కోట్లు బడ్జెట్ పెట్టడం అంటేనే సాహసం గా చెప్పుకునే టైమ్ లో, రెండు సినిమాల కోసం దాదాపు 500ల కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్. ఆర్కా మీడియా బ్యానర్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్ క్లూజన్ చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చెరిగిన పోని రికార్డులు అందుకొన్నాయి. బాహుబలి లాంటి సినిమాల తర్వాత ఆర్యా మీడియా బ్యానర్లో ఎలాంటి సినిమా రాబోతుంది. అనే ప్రశ్నకి సమాధానం వచ్చేసింది. ఈ నిర్మాతలు కూడా ఈ సారి చిన్న సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ఆర్యా మీడియా నెక్ట్స్ మూవీ చేయబోతుంది. ప్రకాష్ కోవెలమూడి డైరెక్షన్లో బాహుబలి నిర్మాతలు చేయబోయే సినిమాలో హీరోగా నటించబోయేది శర్వానంద్. వరసు విజయాలు అందుకుంటూ సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటున్న శర్వానంద్ ని, తమ హీరోగా ఫిక్స్ చేసుకున్నారు శోభు యార్లగడ్డ అండ్ దేవినేని ప్రసాద్. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళబోతుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









