బాహుబలి 2 స్పెషల్ షో వేయించిన నిజామాబాద్ ఎంపీ కవిత
- May 14, 2017
రిలీజై మూడు వారాలైనా బాహుబలి2 మానియా తగ్గడంలేదు. చిన్నా,పెద్దా, ముసలి ముతకతోపాటు, పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ సినిమాని చూస్తూ తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపి కవిత పొతంగల్ గ్రామస్తులకు బాహుబలి2 సినిమా ప్రత్యేక షో వేయించి చూపించారు.
మాతృదినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ నుంచి స్పెషల్ గా తెప్పించిన ఈక్విప్మెంట్తో స్థానిక స్కూల్లో పెద్ద తెరపై ఈ సినిమా ప్రదర్శించారు. కవిత కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి సినిమా వీక్షించారు. సినిమా చూడ్డం కోసం మహిళలు ఇళ్లకు తాళాలు వేసి మరీ స్కూలు వద్దకు వచ్చి అంతా కలిసి ఆనందంగా సినిమా సంబరాన్ని జరుపుకున్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









