గుమ్మడి గింజలు, అవిసె గింజలు, నువ్వులు ఏంటి ప్రయోజనం
- May 15, 2017
గుమ్మడి, అవిసె, నువ్వుల్లో పోషకాలు వున్నాయి. ఓ కప్పు వేయించిన గుమ్మడి గింజల్లో 168 మిల్లీ గ్రాముల మెగ్నీషియం వుంటుంది. అంటే ఓ మహిళ రోజువారీ అవసరాలకు కావల్సిన మెగ్నీషియంలో సగం అందుతుందన్నమాట. దీనివల్ల బలహీనంగా మారిన ఎముకల సాంద్రత పెరుగుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. వీటిల్లోని జింక్ పోషకం, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఈ గింజలను ఉప్పు నీళ్లలో ఉడికించి తడి లేకుండా ఆరబెట్టి ఆపైన తక్కువ నూనెతో వేయించుకుని తింటే పూర్తిస్థాయిలో పోషకాలు అందుతాయి.
అవిసె గింజలు మేలురకం కొవ్వులకీ, ఒమెగాత్రీ ఫ్యాటీ ఆమ్లాలకు పెట్టింది పేరు. వీటిని తినడం వల్ల స్త్రీ హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ లోపం లేకుండా ఉంటుంది. దీనిలోని అల్ఫాలినోలెనిక్ అనే పోషకం కండరాలకు బలాన్ని ఇస్తుంది.
నవ్వులు ఇనుము, క్యాల్షియం, మెగ్నీషియంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా వుంచే విటమిన్ 'ఇ'ని ఇస్తుంది. అందువల్ల ఆహారంలో ఈ మూడింటిని భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









